భారత మాజీ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తల్లి కాబోతోంది. ఈ మేరకు తాను తల్లి కాబోతున్నట్లు ఇన్స్టా వేదికగా ఆమె స్వయంగా ప్రకటించింది. ‘కొత్త ఛాప్టర్తో మా లవ్ స్టోరీ కొనసాగుతుంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. కాగా, 2018లో వినేశ్, సోమ్వీర్ రథీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ చేరుకున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ICC టోర్నీ ఫైనల్స్లో రెండు సార్లు తలపడ్డాయి. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఈ రెండు జట్లు ఫైనల్లో పోటీపడగా కివీస్ విజయం సాధించింది. దీంతో ఆదివారం జరిగే ఫైనల్స్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీస్లో హాఫ్ సెంచరీతో రాణించడంతో 705కి పైగా పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్ (వెస్టిండీస్) 17 మ్యాచ్ల్లో 791 రన్స్ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. జయవర్ధనే (శ్రీలంక) 22 మ్యాచ్లలో 742 రన్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్లో AUSతో జరుగుతున్న మ్యాచ్లో IND టాస్ ఓడిపోయింది. కెప్టెన్గా రోహిత్ టాస్ ఓడిపోవడం వరుసగా ఇది 14వ సారి. అయితే ఈ టోర్నీలో టాస్ ఓడిన ప్రతి మ్యాచ్లో భారత్ గెలవడంతో ఇది శుభసూచికమని అభిమానులు అంటున్నారు. అయితే ఆసీస్ లాంటి జట్టు 270 కంటే ఎక్కువ స్కోరు చేస్తే గెలవడం అసాధ్యమని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో రేపు టీమిండియా సెమీస్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కి జట్టు ఎంపిక టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. కివీస్తో మ్యాచ్లో భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన చక్రవర్తి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో తుది జట్టులో ఎవరికి చోటు కల్పించాలనేది పెద్ద సవాలుగా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో మార్చి 4(మంగళవారం) నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మార్చి 4న దుబాయ్ వేదికగా జరిగే తొలి సెమీస్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మార్చి 5న పాకిస్థాన్ వేదికగా జరిగే రెండో సెమీస్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది. కాగా, అన్ని మ్యాచ్లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్కు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో కోహ్లీ మరో 148 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర(14234) రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్(18426) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడుతుంది. దీంతో ఒకే మైదానంలో మ్యాచ్లు ఆడతుండటంతో భారత్ ప్రయోజనం పొందుతోందని పలువురు క్రికెటర్లు వాదిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని సౌతాఫ్రికా క్రికెటర్ వాన్ డర్ డస్సెన్ వ్యక్తం చేశాడు. భారత్ ప్రయోజనాన్ని పొందుతోందని అర్థం చేసుకోవడానికి రాకెట్ సైంటిస్ట్ కానక్కర్లేదన్నాడు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్లోని రావల్పిండి వేదికగా జరగాల్సిన మ్యాచ్లో వర్షం కారణంగా టాస్ ఆలస్యం అవుతోంది. కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్కు చెందిన భారత సంతతి క్రికెటర్ రచిన్ రవీంద్ర బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి మ్యాచ్లో గాయం కారణంగా దూరమైన అతడు ఈ మ్యాచ్లో అదరగొడుతున్నాడు. ఈక్రమంలోనే కివీస్ తరఫున వన్డేల్లో వేగంగా 1000 పరుగులు(26 ఇన్నింగ్స్ల్లో) చేసిన 5వ ఆటగాడిగా నిలిచాడు.
KRNL: శివరాత్రి రాత్రి మహోత్సవాలు సందర్భంగా పంచ లింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఈనెల 28వ తేదీన అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించునున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసనాయన సోమవారం తెలిపారు. గెలుపొందిన వారికి వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందజేయనున్నట్లు చెప్పారు.
ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా కార్య దర్శి సుందర రామిరెడ్డి తెలిపారు. ఈ జట్టు రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఎంపికైన క్రీడాకారులు మార్చి 6, 7, 8 తేదీలలో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగే పోటీలలో పాల్గొంటున్నారు.