ముంబై స్టార్ పేసర్ బుమ్రా దాదాపు మూడు నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. నేడు RCBతో జరగనున్న మ్యాచ్లో ఆడతాడని MI కోచ్ జయవర్ధనె ఇప్పటికే వెల్లడించాడు. ఈ క్రమంలోనే RCB ప్లేయర్ టిమ్ డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వేసే తొలి బంతిని తమ ఓపెనర్లు ఫోర్ లేదా సిక్స్ కొడతారని తెలిపాడు. కాగా, టిమ్ డేవిడ్ గతేడాది MI తరఫున ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
KRNL: ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో మంగళవారం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వృషభలకు వరుసగా రూ.30వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
చెపాక్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. DC బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (77), పొరేల్ (33), అక్షర్ పటేల్ (21), రిజ్వీ (20), స్టబ్స్ (24) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 183/6 పరుగులు చేసింది. ఇక CSK బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. CSK టార్గెట్ 184.
IPL 2025లో భాగంగా సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్య కుమార్ (67), నమన్ధీర్ (46), తిలక్ వర్మ(25) పరుగులు చేశారు.
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ మళ్లీ ట్రోలింగ్కు గురయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో బాబర్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్కు చేరాడు. దీంతో బాబర్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడని.. మరో 99 పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తృటిలో సెంచరీ చేజారిపోయిందంటూ మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు.
టాప్ ర్యాంక్ ఆటగాళ్ల పేర్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. యువ బ్యాటర్ శుభమన్ గిల్ వన్డేల్లో అగ్రస్థానంలో నిలువగా, టీ20ల్లో నెంబర్ వన్ ఆల్రౌండర్గా హార్థిక్ పాండ్య స్థానం దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మరణం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. థాయ్లాండ్లో ఓ విల్లాలో వార్న్ చనిపోగా.. అందుకు గుండెపోటు కారణమని భావించారు. తాజాగా ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఘటనాస్థలంలో లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఔషధ బాటిల్ లభ్యమైనట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. దానిని అక్కడనుంచి తొలగించాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు.
విశాఖ: జిల్లాలో ఇదే నా తొలి మ్యాచ్ అంటూ నితీశ్ కుమార్ రెడ్డి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘నేను విశాఖ స్టేడియంలో చాలా మ్యాచ్లు ఆడాను. కానీ వేలాది మంది క్రీడాభిమానుల మధ్య ఆడడం ఇదే తొలిసారి. తెలుగు ఫ్యాన్స్ నన్ను తమ కుటుంబంలో ఒకడిగా చూస్తున్నారు. మీరు మా దగ్గరి నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేందుకు కృషి చేస్తాం.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై తడబడుతోంది. తిలక్ వర్మ (39), సూర్యకుమార్ యాదవ్ (48) మినహా మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ముంబై 15 బంతుల్లో 68 పరుగులు రాబట్టాల్సి ఉంది.
IPLలో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్పై ఇప్పుడు అంతా చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఈ సీజన్కు ముందే ధోనీ స్పష్టత ఇచ్చాడు. ‘విరిగిపోని దానిని మళ్లీ అతికించడం ఎందుకు? బ్యాటర్లు మంచిగా పరుగులు చేస్తున్నప్పుడు సమస్య ఏముంది. ఒకటీ, రెండు మ్యాచుల్లో ఫలితం అనుకూలంగా రాకపోయినా.. కంగారుపడాల్సిన అవసరం లేదు. ప్రతిసారీ ఇలాగే జరిగితే మాత్రం నా ఆలోచనల్లో మార్పు రావచ్చు’ అని వెల్లడించాడు.
ఈసారి ఐపీఎల్లో రాజస్థాన్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. దీనిపై మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ స్పందించాడు. ఆ జట్టు బ్యాటర్లు ఇబ్బందిపడుతున్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. కోల్కతాతో జరిగిన పోరులో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీని ఎదుర్కోలేకపోయారని అన్నాడు. అలాగే, రాజస్థాన్ బౌలర్లు మాత్రం ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారని చెప్పుకొచ్చాడు.
అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఓటమిపై కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి మూడు ఓవర్లతో పాటు మిడిల్ ఓవర్లలో పరుగులు చేయకపోవడం ఓటమికి కారణమని తెలిపాడు. బౌలింగ్లో ఇవ్వాల్సిన పరుగుల కంటే ఎక్కువ ఇచ్చామని.. ఫీల్డింగ్లో కూడా తప్పులు జరిగాయని పేర్కొన్నాడు.
పంజాబ్ ఈ సీజన్ను ఘనంగా ఆరంభించింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో గుజరాత్ 232/5 పరుగులకే పరిమితమైంది. సాయి సుదర్శన్ (74) బట్లర్ (54), రూథర్ఫోర్డ్ (46) పోరాడినప్పటికీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. అతడి భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వారిద్దరూ కుమార్తెతో దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ ఫొటోలో ఎలాంటి వాస్తవం లేదు. అది ఏఐ జనరేటెట్ ఫొటో అని వెల్లడైంది. అచ్చం చూడ్డానికి ఒరిజినల్ ఫొటోను పోలి ఉండటంతో ఈ ఇమేజ్ను నిజమే అనుకుని చాలామంది షేర్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. IPLలో కోహ్లీ ఇప్పటివరకు 64 హాఫ్ సెంచరీలు చేశాడు. మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్(66) పేరిట ఉంది. తర్వాత స్థానాల్లో శిఖర్ ధావన్(53), రోహిత్ శర్మ(45), డివిలియర్స్(43) ఉన్నారు.