కృష్ణా జిల్లాకు చెందిన చెస్ ప్లేయర్ కోనేరు హంపి 2024 మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఆదివారం న్యూయార్క్ (USA)లో జరిగిన ఫైనల్లో హంపి, ఇండోనేషియాకు చెందిన ఇరీన్ సుకందార్పై విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది. 2019లో కూడా ఈ ఛాంపియన్షిప్ గెలిచిన హంపి, రెండోసారి ఈ ఘనత సాధించింది.
SKLM: వజ్రపుకొత్తూరు గోవిందపురం ఉన్నత పాఠశాలలో ఈనెల 30, 31న గ్రిగ్స్ మీటను నిర్వహించనున్నట్లు హెచ్ఎం కె.హరిబాబు, పీడీ .నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గంలోనే ఉన్న క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి ఈ పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాఠశాల అనుమతి తప్పనిసరి అన్నారు.
SKLM: పారా అథ్లెటిక్స్ ఛాంపియన్- 2025 పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికలు నిర్వహించనున్నట్లు స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనేందుకు క్రీడా కారులు తమ వివరాలను జనవరి 5లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9381368209 నంబర్ సంప్రదించాలని తెలిపారు.
ప్రో కబడ్డీ సీజన్-11 పూణేలోని చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో పట్నా పైరేట్స్ పై హర్యానా స్టీలర్స్ 32-23 పాయింట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ నుంచి శివమ్ పటారే(9) పాయింట్స్ సాధించి తన జట్టును విజయం వైపుకు నడిపించాడు. దీంతో హర్యానా.. సీజన్-11 ఛాంపియన్స్గా నిలిచింది.
బాక్సింగ్ డే టెస్ట్ నాలుగో రోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మూడు క్యాచ్లు జారవిడిచాడు. ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, కమిన్స్ ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేశాడు. దీంతో జైస్వాల్పై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ‘అరే జస్సూ.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా..? బాల్ ఆడేదాకా కిందే ఉండు’ అంటూ ఆగ్రహానికి గురయ్యాడు.
పాకిస్థాన్తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. మార్క్రమ్ 37, తెంబా బావుమా 40 పరుగులతో రాణించారు. అయితే, వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో కగిసో రబాడ 31* కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.
BGTలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా భారత్ నాలుగో టెస్టు ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల లీడ్ సాధించింది. అయితే ఈ మ్యాచులో భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. మెల్ బోర్న్ మైదానంలో ఆసీస్పై 1928లో టెస్టులో ఇంగ్లాండ్ 332 పరుగులను ఛేదించింది. ఇప్పుడు భారత్ గెలిస్తే ఆ రికార్డును అధిగమిస్తుంది.
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగోవ రోజు ఆట ముగిసింది. ఆసీస్ 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో 333 రన్స్ ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో లైయన్ (41*), బోలాండ్ (10*) ఉన్నారు. ఖవాజా 21, కొన్స్టాప్ 8, స్మిత్ 13, హెడ్ 1, మార్ష్ 0, కారే 2, కమిన్స్ 41, లబుషేన్ 70, స్టార్క్ 5 రన్స్ చేశారు. బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా 1 వికెట్ […]
BDK: అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు నేటి నుంచి జనవరి 5 వరకు జరగనున్న సందర్భంగా ఆదివారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ తెలం వెంకట్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడలను ప్రారంభించారు. నేటి యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడలకు అలవాటు కావాలని ఎమ్మెల్యే తెలిపారు.
వనపర్తి: రాష్ట్ర స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో వనపర్తి మండలం చిట్యాల విద్యార్థిని సింగరపు ఝాన్సీ బంగారు పతకం సాధించినట్లు చిట్యాల కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమీ మాస్టర్ వరుణ్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అండర్ 13, 14, 15 విభాగాల్లో 45 కేజీల పాయింట్ ఫైట్ 4 రౌండ్లలో పాల్గొని పతకం సాధించారని వెల్లడించారు.
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్గా హంపి నిలిచింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించింది. చైనా గ్రాండ్మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్గా హంపి రికార్డు దక్కించుకుంది.
ADB: రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న, శ్రావణి జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు ఎంపికయినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్య దర్శి నారాయణరెడ్డి తెలిపారు. స్వప్న రాష్ట్ర మహిళా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుందన్నారు. ఆయనతో పాటు పలువురు వారిని అభినందించారు.
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతుంది. టీ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో లబుషేన్ (65*), పాట్ కమిన్స్ (21*) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు తీశారు.
టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. ఓవరాల్గా నాలుగో పేసర్గా బుమ్రా నిలిచాడు. ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత బుమ్రా ఈ రికార్డును సాధించాడు. కెరీర్లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200+ వికెట్ల మార్క్ను అందుకొన్నాడు.
HYD: గచ్చిబౌలీ బాలయోగి స్టేడియంలో జాతీయ మాస్టర్స్ అథ్లెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మాస్టర్స్ క్రీడ పోటీలు జనవరి 4, 5వ తేదీన నిర్వహించనున్నట్లు మాస్టర్స్ అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల సైతం పాల్గొంటారన్నారు.