• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

సూర్యవంశీపై గిల్ వ్యాఖ్యలు.. జడేజా కౌంటర్

RR ‘సిక్సర్ల పిడుగు’ సూర్యవంశీపై మ్యాచ్ అనంతరం GT కెప్టెన్ గిల్ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తప్పుబట్టాడు. ‘ఈరోజు సూర్యవంశీకి అదృష్ట రోజు. తనకు కలిసొచ్చిన రోజులో అద్భుత హిట్టింగ్ చేశాడు.’ అని గిల్ అన్నాడు. దీనికి జడేజా కౌంటర్ ఇస్తూ ’14 ఏళ్ల వయసులో అదృష్టంతో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడలేరు. దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది’ అంటూ గిల్ పేరు ప్రస్తావించకుండా చ...

April 29, 2025 / 03:31 PM IST

IPL అభిమానులకు గుడ్‌న్యూస్

ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్. 2028 నుంచి ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి సీజన్‌లో 74 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే, 2028 నుంచి మరో 20 మ్యాచ్‌లు పెంచాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. అయితే, దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

April 28, 2025 / 05:29 PM IST

DC vs RCB: తుది జట్లు ఇవే

DC XI: ఫాఫ్ డుప్లెసిస్, పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్‌దీప్ యాదవ్, ముకేశ్ కుమార్. RCB XI: కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాళ్.

April 27, 2025 / 08:05 PM IST

MI vs LSG: ముంబై భారీ స్కోర్

వాంఖడే మైదానం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోర్ చేసింది. రికెల్టన్ (58), సూర్యకుమార్ యాదవ్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. విల్ జాక్స్ (29), బాష్ (20), నమన్ ధీర్ (25*) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.

April 27, 2025 / 05:23 PM IST

రోహిత్, కోహ్లీ గురించి మాటల్లో చెప్పలేను: గిల్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై శుభమన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరితో కలిసి ఆడటంపై మాట్లాడాడు. రోహిత్, కోహ్లీ వంటి ప్లేయర్లను చూస్తూ తాను పెరిగినట్లు తెలిపాడు. ఇప్పుడు వారితో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేనని వెల్లడించాడు. ఆ అనుభూతిని వర్ణించడం కష్టమేనని చెప్పుకొచ్చాడు.

April 26, 2025 / 08:24 PM IST

చెలరేగుతున్న భారత జూనియర్ బాక్సర్లు

జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత బాక్సర్లు పంచ్‌లతో చెలరేగుతున్నారు. ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే 39 పతకాలు ఖరారు కాగా, ఇవాళ మరో నలుగురు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో ఈసారి దాదాపు 43 పతకాలు భారత బాక్సర్ల ఖాతాలో చేరనున్నాయి.

April 26, 2025 / 05:29 PM IST

ధోనీకి ఆ బంతులేస్తే బాదేస్తాడు: హర్షల్ పటేల్

CSKతో జరిగిన మ్యాచ్‌లో SRH బౌలర్ హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ధోనీ వికెట్ తీశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బౌలర్‌పై ఒత్తిడి ఉంటుందని తెలిపాడు. వికెట్లకు దూరంగా అస్సలు బౌలింగ్ చేయకూడదని.. ఆ బంతులను ధోనీ బాదేస్తాడని చెప్పాడు. అందుకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి ఫలితం రాబట్టగలిగినట్లు చెప్పుకొచ్చాడు.

April 26, 2025 / 05:25 PM IST

తొలి సిక్స్ బాదిన జడేజా

SRHతో జరుగుతున్న ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా తొలి సిక్స్‌ బాదాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో ఇదే మొదటి సిక్స్ కావడం గమనార్హం. అయితే జీషాన్‌ అన్సారీ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన జడేజా.. కమిందు బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. 17 బాల్స్‌లో 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం చెన్నై 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

April 25, 2025 / 08:29 PM IST

BREAKING: హౌం గ్రౌండ్‌లో RCB ఘనవిజయం

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో RCB సంచలన విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. జైస్వాల్ (49), ధ్రువ్ జురెల్ (47) రాణించిన విజయం అందించలేకపోయారు. RCB బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీశాడు.

April 24, 2025 / 11:27 PM IST

జట్టులోకి సంజూ శాంసన్.. ద్రవిడ్ కీలక అప్‌డేట్

IPL 2025లో భాగంగా నేడు RCBతో రాజస్థాన్ తలపడనుంది. ఈ క్రమంలో RR కెప్టెన్ సంజూ శాంసన్ ఆరోగ్య పరిస్థితిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం సంజూ ఆరోగ్యంగా లేడని.. వైద్య బృందం ఆడటానికి అనుమతి ఇవ్వలేదని తెలిపాడు. వైద్యుల సలహా మేరకు వచ్చే మ్యాచ్‌లలో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించాడు.

April 24, 2025 / 05:19 PM IST

ఉగ్రదాడి.. బీసీసీఐ కీలక నిర్ణయం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల మధ్య చివరిగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నీలలో మాత్రమే భారత్, పాకిస్థాన్ ఆడుతున్నాయి. తాజా ఘటనతో శాశ్వతంగా ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించొద్దని బీసీసీఐ నిర్ణయించింది.

April 24, 2025 / 02:22 PM IST

IPL 2025: టాప్‌లోకి దూసుకొచ్చిన కుర్రాడు

IPL 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. యంగ్ ప్లేయర్లు అదరగొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 417 పరుగులతో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. పూరన్ 377, జాస్ బట్లర్ 356 పరుగులతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. మరోవైపు GT బౌలర్ ప్రసిధ్ కృష్ణ 16 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. కుల్దీప్ 12, నూర్ 12 టాప్ 3లో ఉన్నారు.

April 23, 2025 / 05:29 PM IST

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే IPLలో 5000 పరుగుల మార్క్‌కు చేరుకున్నాడు. మొత్తం 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5000 పరుగులు చేశాడు. దీంతో అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న క్రికెటర్ గానూ నిలిచాడు.

April 22, 2025 / 11:18 PM IST

RRపై ఫిక్సింగ్ ఆరోపణలు.. ఖండించిన యాజమాన్యం

ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అడ్‌హక్ కమిటీ కన్వీనర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలను రాజస్థాన్ యాజమాన్యం ఖండించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, క్రీడా మంత్రికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అతడు చేసినవి తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసింది.

April 22, 2025 / 05:22 PM IST

Mr.CONSISTENT: సాయి సుదర్శన్

గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన బ్యాటింగ్‌‌తో ‘Mr.CONSISTENT’గా మారాడు. ఈ సీజన్‌లో తను ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 అర్థ సెంచరీలు సాధించాడు. 417 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ దక్కించుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. అతడు ఇలాగే రాణిస్తే త్వరలో టీమిండియాలో స్థానం సంపాదించే అవకాశం ఉంది.

April 22, 2025 / 08:28 AM IST