విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బ్యాటర్ అమన్ రావ్ విధ్వంసం సృష్టించాడు. బెంగాల్తో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 154 బంతుల్లోనే 12 ఫోర్లు, 13 భారీ సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తన కెరీర్లో నమోదైన తొలి లిస్ట్-A సెంచరీనే నేరుగా ద్విశతకంగా మార్చి ఆశ్చర్యపరిచాడు. కాగా, ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్తో డబుల్ సెంచరీ సాధించడం విశేషం.
యాషెస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 518/7 పరుగులు చేసింది. హెడ్ (163) భారీ సెంచరీతో చెలరేగగా, స్మిత్ 129 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 134 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులకు ఆలౌటైంది.
మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2011 ప్రపంచకప్ సమయంలోనే తనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడిందని చెప్పాడు. ఒకవేళ కీమోథెరపీ చేయించుకోకపోతే.. గుండెపోటు వచ్చి 3 నుంచి 6 నెలల్లోనే చనిపోతానని డాక్టర్లు హెచ్చరించినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత తాను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని, ఆ మహమ్మారిని ధైర్యంగా అధిగమించినట్లు చెప్పుకొచ్చాడు.
దాదాపు 144 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డ్ సాధించాడు. తాజాగా అతడు ఇంగ్లండ్పై చేసిన సెంచరీ యాషెస్లో 13వది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా జాక్ హాబ్స్(12) రికార్డును అధిగమించాడు. ఆసీస్ లెజెండ్ బ్రాడ్మాన్ (19) తొలి స్థానంలో ఉన్నాడు.
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ 66వ పుట్టినరోజు నేడు. 1983లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుంది. కెప్టెన్గా, ఆల్రౌండర్గా అతడు చూపిన అసాధారణ ప్రతిభ భారత క్రికెట్ దిశను మార్చింది. నేటికీ ఎందరో యువ ఆటగాళ్లకు అతడే ఒక రోల్ మోడల్. ఈ దిగ్గజానికి క్రికెట్ ప్రపంచం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.
యాషెస్ చివరి టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్లో 12వ సెంచరీ. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులకు ఆలౌట్ అవ్వగా, ఆస్ట్రేలియా దానికి ధీటుగా బదులిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 158 పరుగుల దూరంలో ఉంది.
దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అయితే.. వర్షం, మెరుపులతో ఆటకు అంతరాయం కలగడంతో మ్యాచ్ను 27 ఓవర్లకు కుదించి భారత్కు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ టార్గెట్ని యువ భారత్ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. 246 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తం 24 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 10 సిక్స్లు, ఒక ఫోర్తో 68 పరుగులు చేసి ఔటయ్యాడు.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోవడంపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. ‘జట్టులో స్థానం కోసం రుతురాజ్ తనలోని మరో నైపుణ్యం గురించి సెలక్టర్లకు చెప్పాలేమో. నేను ధోనీతో కలిసి ఆడాను. వికెట్ కీపింగ్ కూడా చేయగలను అని రుతురాజ్ చెప్పాలి. జట్టులోకి తిరిగి వచ్చేందుకు అతడికి అదొక్కటే మార్గం’ అని BCCIపై విమర్శలు చేశాడు.
భారత అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రోల్స్(114) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. డేనియల్ బోస్మాన్(31), లగాడియన్ (25) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ 4, అంబరీష్ 2, దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అతడి సోదరుడు మహ్మద్ కైఫ్కి కూడా నోటీసులు పంపింది. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిరిస్ట్రేషన్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్కు ఎంపిక కాకపోవడంపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. BCCI సెలక్టర్లు ప్లేయర్ల ఫామ్, నాణ్యత కంటే జట్టు కూర్పు పైనే ఎక్కువ దృష్టిపెట్టారని అన్నాడు. సిరాజ్ వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాలేదని చెప్పుకొచ్చాడు.
టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. అసోషియేషన్లో పారదర్శకత లోపించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సంస్థ నడుస్తున్న విధానాలతో తాను ఇకపై ఏకీభవించలేనని చెప్పాడు. కాగా, ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ను 2019లో వాసెక్ పోస్పిసిల్, జకోవిచ్ కలిసి స్థాపించారు.
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో శ్రేయస్ రెండు మ్యాచ్లు ఆడనున్నాడు. అయ్యర్ తన పునరాగమనంలో ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ అయ్యర్కు అప్పగించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారాలను నిషేధిస్తూ ఆదేశించింది. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి వల్ల హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్లో ఆ దేశానికి చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆటగాడిని రిలీజ్ చేయమని BCCI కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీని ఆదేశించింది.