• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఫైనల్ రేసునుంచి టీమిండియా ఔట్..!

మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ చేతిలో 184 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. దాదాపు ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించినట్లైంది.

December 30, 2024 / 01:47 PM IST

మన్మోహన్‌కు భారతరత్న.. అప్పట్లోనే ప్రణబ్ ప్రతిపాదన

మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ప్రకటించాలనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. అయితే మన్మోహన్‌‌ను భారతరత్నతో సత్కరించాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భావించారట. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప ఆర్థిక వేత్త అని 2013లోనే ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నట్లు ఆయన కూతురు శరిష్ఠ ముఖర్జీ తాజాగా వెల్లడించారు.

December 30, 2024 / 12:13 PM IST

BIG BREAKING: బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. జైస్వాల్(84) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఏడు వికెట్లను భారత్ 35 పరుగుల తేడాతో కోల్పోయింది. కాగా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యం సంపాదించింది.

December 30, 2024 / 11:57 AM IST

బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. జైస్వాల్(84) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఏడు వికెట్లను భారత్ 35 పరుగుల తేడాతో కోల్పోయింది. కాగా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యం సంపాదించింది.

December 30, 2024 / 11:57 AM IST

వివాదాస్పదంగా మారిన జైస్వాల్ ఔట్

మెల్‌బోర్న్ టెస్టులో నిలకడగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. అయితే.. యశస్వి ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. తొలుత ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఆసీస్ డీఆర్ఎస్ తీసుకుంది. సమీక్షలో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఈ నిర్ణయంపై యశస్వి అసహనం వ్యక్తం చేశాడు. స్నికో మీటర్‌లో స్రైక్స్ రాకపోయినా.. బంతి టర్న్ అయిందనే కారణంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.

December 30, 2024 / 11:38 AM IST

AUS vs IND: హెడ్ తీరుపై తీవ్ర విమర్శలు

మెల్‌బోర్న్ టెస్టులో ట్రావిస్ హెడ్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. హెడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పంత్ ఔటయ్యాడు. ఈ క్రమంలో హెడ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హెడ్‌ను అన్ని ICC నాకౌట్ మ్యాచ్‌ల నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్‌ను పిల్లలు సైతం చూస్తున్నారని.. హెడ్ అలా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నారు.

December 30, 2024 / 11:24 AM IST

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు విజయనగరం టీచర్

VZM: జనవరి 3 నుండి 8 వరకూ ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు గుణుపూరు పేట వ్యాయామ ఉపాధ్యాయుడు సారిపల్లి గౌరీశంకర్ ఎంపికైనట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యారు.

December 30, 2024 / 11:18 AM IST

ఆసీస్‌కు అవకాశం ఇవ్వని యశస్వి- పంత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 112/3 పరుగులు చేసింది. ప్రస్తుతం యశస్వి (63*), పంత్ (28*) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 9 , కేఎల్ రాహుల్ 0, కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. భారత్ విజయానికి ఇంకా 228 పరుగులు కావాల్సి ఉంది. ఇక ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.

December 30, 2024 / 09:56 AM IST

ఆసీస్‌కు అవకాశం ఇవ్వని యశస్వీ- పంత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 112/3 పరుగులు చేసింది. ప్రస్తుతం యశస్వి (63*), పంత్ (28*) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 9 , కేఎల్ రాహుల్ 0, కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. భారత్ విజయానికి ఇంకా 228 పరుగులు కావాల్సి ఉంది. ఇక ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.

December 30, 2024 / 09:56 AM IST

AUS vs IND: నిలకడగా రాణిస్తున్న భారత్

బాక్సింగ్ డే టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యశస్వి, పంత్ ప్రయత్నిస్తున్నారు. యశస్వి 58* , పంత్ 17* పరుగులతో నిలకడగా రాణిస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి మరో 243 పరుగులు కావాల్సి ఉంది.

December 30, 2024 / 09:13 AM IST

నిరాశపర్చిన రోహిత్.. రాహుల్ డకౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. 16 ఓవర్లలో 25 పరుగులు చేసిన భారత్ అదే స్కోర్ వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే ఔట్ అవ్వగా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా అదే ఓవర్‌లో డకౌట్ అయ్యాడు.

December 30, 2024 / 07:12 AM IST

AUS vs IND: భారత్‌కు మరో షాక్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 33/3 పరుగులు చేసింది. జట్టు విజయానికి మరో 307 పరుగులు కావాల్సి ఉంది. రోహిత్ శర్మ 9 , కేఎల్ రాహుల్ 0, కోహ్లీ 5 పరుగులకే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు.

December 30, 2024 / 07:11 AM IST

అథ్లెటిక్ క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్సీ

విజయనగరం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆదివారం స్దానిక రాజీవ్ గాంధీ స్టేడియంలో అథ్లెటిక్ క్రీడాకారులను కలసి అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈనెల 14, 15న జరిగిన రాష్ట్ర స్థాయి అభ్లెటిక్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి ఖ్యాతి తీసుకు రావాలని క్రీడాకారులను కోరారు.

December 30, 2024 / 05:18 AM IST

ఆసీస్‌ ఆలౌట్‌.. భారత్‌ టార్గెట్ ఎంతంటే?

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో జరుగుతున్న 4వ టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. 228/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో 5వ రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. 339 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లబుషేన్‌ (71) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టెస్టులో గెలవాలంటే భారత్‌ 340 పరుగులు చేయాల్సి ఉంది.

December 30, 2024 / 04:55 AM IST

అండర్-12 క్రికెట్ జట్టు కెప్టెన్ గా కార్తీక్ వర్మ

W.G: ఉండి మండలం కోలమూరు గ్రామానికి చెందిన నంబూరి కార్తీక్ వర్మ పశ్చిమగోదావరి జిల్లా అండర్-12 జట్టుకి కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా కార్తీక్ వర్మను డీఎన్ఆర్ ఏసీ ఏ క్యాంప్ కోచ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కార్తీక్ వర్మను భీమవరం పట్టణంలోని క్రికెట్ అభిమానులు, పట్టణ ప్రాంత ప్రజలు అభినందించారు.

December 30, 2024 / 04:41 AM IST