భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా తాజాగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ఆకృతి అగర్వాల్తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘మైదానంలో సిక్సర్లు బాది జీవితాంతం హిట్లు కొట్టాను. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్!’ అని రాసుకొస్తూ.. నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ ఫిన్ అలెన్ టీమిండియా బౌలర్ బుమ్రాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నా మంత్రం చాలా స్పష్టం. బంతిని చూసి ఆడతాను తప్ప, బౌలర్ పేరును చూసి కాదు. అవతల బుమ్రా పరిగెత్తుకుంటూ వస్తున్నాడని ఆలోచిస్తే.. ఆట కంటే ఒత్తిడికే ఎక్కువ లోనవుతాం. అందుకే నేను బౌలర్ ప్రతిష్ట గురించి ఆలోచించకుండా కేవలం బాల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తా’ అని పేర్కొన్నాడు.
T20 WC ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు టీమిండియా T20 WC చరిత్రలో న్యూజిలాండ్పై ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో భారత్ ఓటమి పాలైంది. ఈరోజు ఫైనల్లో ఈ రెండు జట్లే తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
T20 WC ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు యాక్టివ్ అయ్యారు. NZపై రూ. వెయ్యికి.. 2900, INDపై రూ. వెయ్యికి.. 400 ఇస్తామని వల వేస్తున్నారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడా?.. ఉండడా అని కొందరు పందెం వేస్తున్నారు. మరోవైపు స్కోర్ 180 దాటుతుందా? ఏ బ్యాటర్ ఎంత స్కోర్ చేస్తాడో అని మరి కొందరు బెట్టింగ్ వేస్తున్నారు.
భారత బాక్సింగ్ జట్టు ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మోంటెనెగ్రోలోని బుడ్వా నగరంలో ఈ నెల 3-11 వరకు జరగాల్సిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత జూనియర్ జట్టు పాల్గొనాల్సి ఉంది. వీసా స్టాంపింగ్ కోసం UAEకి పంపిన పాస్పోర్టులు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణం నిలిచిపోయాయి. దీంతో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా టోర్ని నుంచి తప్పుకుంది.
T20 WC ఫైనల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగడం న్యూజిలాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. గతంలో అహ్మదాబాద్లోనే భారత్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది. భారత్ను ఓడించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు న్యూజిలాండ్ వద్ద ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని పేర్కొన్నాడు.
T20 WC ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఫైనల్లో భారత్ ఆడనుండటంతో అహ్మదాబాద్ స్టేడియం క్రీడా అభిమానులతో సందడిగా మారింది. ఈ మ్యాచ్కి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాలను నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచింది. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
INDwతో స్వదేశంలో జరిగే ఈ మల్టీ ఫార్మాట్ సిరీసే తనకు చివరిదని AUSw కెప్టెన్ అలీసా హేలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏకైక టెస్టు అనంతరం హేలీకి కంగారూ అమ్మాయిలతో పాటు భారత్ ఘన వీడ్కోలు పలికింది. 2010 నుంచి ఆస్ట్రేలియాకు హేలీ అందించిన సేవలు చిరస్మరణీయం. హేలీ ఆరు T20 WC, రెండు వన్డే WC విన్నింగ్ టీమ్స్ మెంబర్. తన సారథ్యంలో ఆసీస్ 2024 T20 WC విజేతగా నిలిచింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో భాగంగా 105/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్ 149 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ముందు 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతీకా రావల్(63) ఒంటరి పోరాటం చేసింది. స్మృతి మంధాన(2), జెమీమా(14), షెఫాలీ(5), హర్మన్ప్రీత్(11), దీప్తి(9) విఫలమయ్యారు.
➤ T20 WC 2007: కివీస్ 190 రన్స్ చేయగా.. ఛేదనలో ధోనీసేనకు గంభీర్-సెహ్వాగ్ శుభారంభం అందించారు. కానీ వెటోరీ బౌలింగ్ ధాటికి భారత్ 10 రన్స్ తేడాతో ఓడింది. ➤ T20 WC 2016: ప్రత్యర్థిని 126/7కే కట్టడి చేసిన ధోనీసేన.. ఛేదనలో చేతులెత్తేసి 47 రన్స్ తేడాతో ఓడింది. ➤ T20 WC 2021: ఒక్కరూ 30 రన్స్ చేయకపోవడంతో కోహ్లీసేన 110/7కే పరిమితం కాగా ప్రత్యర్థి 8 వికెట్ల తేడాతో గెలిచింది.
T20 వరల్డ్ కప్ టైటిల్ కోసం ఇవాళ భారత్-న్యూజిలాండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ హైఓల్టేజ్ పోరుకు వర్షం ముప్పేమీ లేదు. ఒకవేళ వర్షం లేదా మరో కారణంగా మ్యాచ్ ఇవాళ సాధ్యం కాకుంటే, రిజర్వ్ డే అయిన రేపు నిర్వహిస్తారు. ఫలితం కోసం కనీసం 5 ఓవర్ల ఆట ఆడే పరిస్థితి లేకుంటే.. భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
భారత్ vs ఆస్ట్రేలియా ఏకైక టెస్ట్ 3వ రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో 105/6 స్కోరుతో 2వ రోజు ఆట ముగించిన హర్మన్ సేన.. ఇంకా 20 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో ప్రతిక(43), స్నేహ్ రాణా(14) ఉన్నారు. ఇప్పటికే T20, ODI సిరీస్లు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ టెస్టు కాపాడుకోవాలంటే వీరిద్దరూ నిలబడి పోరాడాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 198, ఆసీస్ 323 చేశాయి.
T20 WC 2024 విజయం తర్వాత రోహిత్ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్న సూర్య జట్టును అద్భుతంగా నడిపించాడు. అయితే T20 WCలో పెద్ద జట్లపై అతనికి చెప్పుకోదగ్గ స్కోర్స్ లేవనే విమర్శలున్నాయి. పైగా ఇవాళ్టి ఫైనల్ తర్వాత రిటైర్ అవుతాడనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘సారథిగా బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేందుకు సూర్యకు ఇదే బెస్ట్ ఛాన్స్, అదే అతని బాధ్యత’ అని సూచించాడు.
న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ లీ తహుహు వన్డేలకు వీడ్కోలు పలికింది. వన్డేల్లో దేశానికి 100+ సార్లు ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ ఊహించలేదని, ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోడానికి ఇది సమయమని ఆమె పేర్కొంది. అయితే ఈ ఏడాది జూన్-జూలైలో వరల్డ్ కప్ టైటిల్ను డిఫెండ్ చేసేందుకు లీ T20ల్లో కొనసాగనుంది. ఇక 15 ఏళ్ల కెరీర్లో లీ 103 వన్డేల్లో 125, 98* T20ల్లో 95 వికెట్లు తీసింది.
ఆస్ట్రేలియా మహిళా జట్టుతో ఏకైక టెస్టులో భారత్ ఓటమి అంచున నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి 2వ ఇన్నింగ్స్లో భారత్ 105/6 స్కోరుతో 20 రన్స్ వెనకబడి ఉంది. ఇప్పటికే T20, ODI సిరీసులు కోల్పోయి నేపథ్యంలో.. ఈ టెస్ట్ అయినా గెలవాలంటే క్రీజులో ఉన్న ప్రతికా రావల్(43), స్నేహ్ రాణా(14) నిలబడి పోరాడితేనే సాధ్యం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 198, ఆస్ట్రేలియా 323 స్కోర్ చేశాయి.