IPL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ 5వ స్థానానికి చేరుకున్నాడు. PBKSతో మ్యాచ్లో 152* పరుగులు చేయడంతో.. 5,579 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సురేష్ రైనా (5,528) రికార్డును రాహుల్ అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ (8,989), రోహిత్ (7,183), శిఖర్ ధావన్ (6,769), డేవిడ్ వార్నర్ (6,565) తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 264/2 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2024లో ముంబై ఇండియన్స్పై సాధించిన 257/4 పరుగుల రికార్డును ఢిల్లీ ఈ మ్యాచ్తో బ్రేక్ చేసింది. అంతేకాకుండా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక టీమ్ స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం.
IPL చరిత్రలో KL రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. PBKSతో మ్యాచ్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152* పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో IPL చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అభిషేక్ శర్మ (141) పేరిట ఉండేది. ఇక ఓవరాల్గా IPLలో క్రిస్ గేల్ (175*), మెకల్లమ్ (158*) తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఢిల్లీ స్టార్ బ్యాటర్ KL రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేస్లోకి దూసుకొచ్చాడు. పంజాబ్తో మ్యాచ్లో 152* పరుగుల భారీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. దీంతో ఈ సీజన్లో మొత్తం స్కోరు 357 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ (328)ని వెనక్కినెట్టి రాహుల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అభిషేక్(323), క్లాసెన్ (320) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఢిల్లీ స్టార్ బ్యాటర్ KL రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేస్లోకి దూసుకొచ్చాడు. పంజాబ్తో మ్యాచ్లో 152* పరుగుల భారీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. దీంతో ఈ సీజన్లో మొత్తం స్కోరు 357 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ (328)ని వెనక్కినెట్టి రాహుల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అభిషేక్(323), క్లాసెన్ (320) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
పంజాబ్తో మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా KL రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. 152* పరుగుల భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. మరోవైపు నితీష్ రాణా తృటిలో సెంచరీని చేజార్చుకున్నప్పటికీ, 91 పరుగులతో అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 220 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో DC.. 264/2 పరుగుల భారీ స్కోరు చేసింది.
IPLలో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 22 సార్లు తలపడగా.. SRH 13, RR 9 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఈ సీజన్లో HYD వేదికగా జరిగిన పోరులోనూ RRను SRH చిత్తు చేసింది. ఇక ఇవాళ మ్యాచ్ జరగనున్న జైపూర్ స్టేడియంలో జరిగిన 4 మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో రెండు విజయాలతో సమంగా నిలిచాయి.
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో KL రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కేవలం 47 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాహుల్కు IPL కెరీర్లో ఇది 6వ సెంచరీ కావడం విశేషం. మరోవైపు అతడికి తోడుగా నితీష్ రాణా (72*) కూడా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. వీరిద్దరి ధాటికి ఢిల్లీ భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
CSK జట్టుకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా CSK జట్టును వీడినట్లు సమాచారం. అతడు మళ్లీ ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. దీంతో రేపు గుజరాత్ టైటాన్స్తో జరగబోయే మ్యాచ్కు రుతురాజ్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేజరిగితే, CSK కెప్టెన్గా సంజూ శాంసన్ వ్యవహరించనున్నాడు.
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో KL రాహుల్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో IPLలో తన 43వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. కాగా, 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను జారవిడిచిన పంజాబ్.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది.
PBKSతో మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. 28 పరుగుల వద్ద ఓపెనర్ నిస్సంక (11) వికెట్ను కోల్పోయింది. అయితే, అర్షదీప్ బౌలింగ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద KL రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను శశాంక్ సింగ్ జారవిడిచాడు. ప్రస్తుతం రాహుల్ (35*), రాణా (22*) క్రీజులో ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో 68/1.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు IPLలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ టాస్ గెలిచింది. గత సీజన్ చివరి రెండు మ్యాచ్ల్లో కూడా టాస్ గెలవడంతో, ఢిల్లీ జట్టు వరుసగా 9 మ్యాచ్ల్లో టాస్ విజయాలను నమోదు చేసుకుంది. గతంలో SRH (2015-16), CSK (2019) కూడా వరుసగా 9 మ్యాచ్ల్లో టాస్ గెలిచి ఈ రికార్డును సృష్టించాయి.
IPL చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు సమంగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 35 మ్యాచ్ల్లో తలపడగా, రెండు జట్లూ చెరో 17 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక ఇవాళ మ్యాచ్ జరుగుతున్న అరుణ్ జైట్లీ స్టేడియం జరిగిన 12 మ్యాచ్ల్లో కూడా ఇరు జట్లు చెరో 6 విజయాలతో నిలిచాయి.
LSG ఓనర్ సంజీవ్ గొయెంకా వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా AI, డిజిటల్ మార్ఫింగ్ను ఉపయోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. అటువంటి కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.