యాషెస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 384 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 567 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ధాటిగా బదులిస్తోంది. యువ సంచలనం జాకబ్ బెథెల్ సెంచరీ పూర్తి చేసుకుని 106 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ENG 219/4 పరుగులు చేసి, 36 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత్ పర్యటనకు ముందే న్యూజిలాండ్ తన టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. సారథిగా మిచెల్ శాంట్నర్ జట్టును నడిపించనున్నాడు. జట్టులో అలెన్, బ్రేస్వెల్, చాప్మన్, కాన్వే, జాకబ్ డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిచెల్, ఆడమ్ మిల్నే, నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫెర్ట్, ఇష్ సోధి సభ్యులుగా ఉన్నారు, అలాగే జెమీసన్ను ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపిక చేశారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 567 పరుగులకు ఆలౌటైంది. దీంతో 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. స్మిత్(138), హెడ్(163) సెంచరీలు చేయగా, వెబ్స్టార్ 71* పరుగులతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 4 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 33/1.
మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ తొలి రౌండ్లో ముందంజ వేశాడు. సింగపూర్కు చెందిన జియా హోంగ్ జాసన్ టెహ్పై 21-16, 15-21, 21-14 తేడాతో అద్భుత విజయం సాధించాడు. మరో మ్యాచ్లో ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ఒలింపిక్ కాంస్య పతక విజేత లీ జి జియాకు షాకిస్తూ.. 21-12, 21-17 తేడాతో విజయం సాధించాడు.
అంధుల క్రికెట్లో భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టును రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఘనంగా సత్కరించారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫౌండేషన్ తరపున ఆ టీమ్కు నీతా అంబానీ రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, సచిన్, రోహిత్ శర్మ పాల్గొన్నారు.
కివీస్తో వన్డే, టీ20 సిరీస్లలో గిల్, సూర్యకుమార్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. గిల్ మరో 225 పరుగులు చేస్తే సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ అమ్లా రికార్డు గల్లంతవుతుంది. 57 ఇన్సింగ్స్లో హషీమ్ 3000 పరుగులు చేశాడు. గిల్ ఆ పరుగులు చేస్తే వేగవంతమైన భారత బ్యాటర్ అవుతాడు. అలాగే, సూర్యకుమార్ 246 రన్స్ చేస్తే టీ20ల్లో 3000 పరుగులు చేసిన వారి జాబితాలో చేరతాడు.
1983 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ 67 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ.270 కోట్లు ఉంటుందని అంచనా. ఓ నివేదిక ప్రకారం కపిల్ దేవ్ ఏటా రూ.12 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన సంపదలో బ్రాండ్ ఎండార్స్మెంట్లు, బహిరంగ ప్రదర్శనలు, క్రీడలకు సంబంధించిన పెట్టుబడులతో పాటు కపిల్ దేవ్స్ ఎలెవెన్ అనే రెస్టారెంట్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూప్ విజేతగా బీహార్ నిలించింది. మణిపూర్తో జరిగిన ఫైనల్లో బీహార్ 6 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 47.5 ఓవర్లలో 169 పరుగులకే చతికిలపడింది. షబీర్ ఖాన్ 7 వికెట్లు తీసి మణిపూర్ పతనాన్ని శాసించాడు. అనంతరం బరిలోకి దిగిన బీహార్ కేవలం 31.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబైతో హిమాచల్ప్రదేశ్ తలపడుతోంది. పొగమంచు కారణంగా ఆటను 33 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 33 ఓవర్లలో 299/9 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ (82) అదరగొట్టాడు. గతేడాది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగాల్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తెలుగు కుర్రాడు అమన్ రావు (200*) డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 352/5 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బెంగాల్ 44.4 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. HYD బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు తీశాడు.
టీ20 ప్రపంచకప్ 2026కు BCCI ప్రకటించిన జట్టుపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. భారత జట్టు కూర్పు బాగుందని హర్భజన్ ప్రశంసించాడు. అయితే, శుభ్మన్ గిల్ జట్టులో లేకపోవడం కాస్త బాధ కలిగించిందని తెలిపాడు. కానీ జట్టులో ఉన్నవాళ్లంతా మ్యాచ్ విన్నర్లే అని.. భారత్ వరుసగా ప్రపంచకప్లు గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఈనెల 11 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీని భారీ రికార్డు ఊరిస్తోంది. విరాట్ మరో 25 పరుగులు చేస్తే సచిన్ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28,000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. విరాట్ ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్ల్లో 27,975 రన్స్ చేయగా.. సచిన్ 644 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ను అందుకున్నాడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లలోనూ ఫైనల్కు వెళ్లినా కప్పు కొట్టలేదు. గత సీజన్ వరకు కెప్టెన్గా ఉన్న మెగ్ లానింగ్ యూపీ జట్టుకు వెళ్లిపోవడంతో భారత స్టార్ జెమీమా రోడ్రిగ్స్ ఢిల్లీ పగ్గాలు అందుకుంది. మరి ఆమె జట్టు రాత మారుస్తుందో లేదో చూడాలి. కెప్టెన్సీలో అనుభవం ఉన్న లారా వోల్వార్ట్ జట్టులో ఉండడం జెమీమాకు కలిసొచ్చే అంశం.
టీమిండియా కెప్టెన్ గిల్కు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. గిల్ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. అతడికి వన్డే జట్టు కెప్టెన్సీ ఇవ్వడాన్ని భజ్జీ సమర్థించాడు. అలాగే, టీమిండియా కోరుకునే కాంబినేషన్ వల్లే టీ20ల్లో గిల్ స్థానం పొందలేకపోయాడని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
హైదరాబాద్ ప్లేయర్ అమన్ రావు VHTలో డబుల్ సెంచరీ సాధించి ఒక్కసారిగా సంచలనంగా మారాడు. 21 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటరైన అమన్, దూకుడైన బ్యాటింగ్కు పెట్టింది పేరు. కరీంనగర్ నుంచి వచ్చిన అతడు తన టాలెంట్తో U-11 స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ IPLలో కూడా ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇటీవలే జరిగిన IPL వేలంలో RR ఇతడిని రూ. 30 లక్షల బేస్ ప్రైజ్తో సొంతం చేసుకుంది.