ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్ను తప్పించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించాడు. ‘మెక్కల్లమ్ కోచ్గా కొనసాగాలని మేము 125% కోరుకుంటున్నాము. నేను చూసిన అత్యుత్తమ కోచ్ అతనే. డ్రెస్సింగ్ రూమ్లో అతనికి ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరూ అతడిని గౌరవిస్తారు. స్ఫూర్తిగా తీసుకుంటారు’ అని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అన్నాడు. ట్రోఫీ సాధించడం కోసం 140 కోట్ల భారత అభిమానుల హృదయాలను బ్రేక్ చేయడానికి కూడా తాము వెనకాడబోమని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఫైనల్ కావడంతో తమకంటే భారత జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. ఫైనల్లో విజయమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మ అసాధారణమైన ఆటగాడు. అతను ఒక అద్భుతమైన ప్రతిభావంతుడు. అభిషేక్ బ్యాటింగ్ చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. అతడిని వేరే ఏ ఇతర బ్యాటర్తోనూ అస్సలు పోల్చలేము’ అని పేర్కొన్నాడు.
భారత మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 323 పరుగులకు ఆలౌటైంది. సదర్లాండ్ (129) సెంచరీతో మెరవగా, పెర్రీ (76) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో సయాలి 4 వికెట్లు పడగొట్టగా, క్రాంతి, దీప్తి తలో రెండు వికెట్లు తీశారు. అయితే, భారత్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులే చేయడంతో, ఆస్ట్రేలియాకు 125 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని కివీస్ కెప్టెన్ శాంట్నర్ వ్యాఖ్యానించాడు. అలాగే, సొంతగడ్డపై జరిగే ఫైనల్లో భారత్పై విజయం సాధించడం అంత సులభం కాదన్నాడు. భారత జట్టులో బుమ్రా మాత్రమే కాదు, ప్రతి ప్లేయర్తోనూ తమకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నాడు.
రేపు భారత్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను చూసి అంతగా భయపడాల్సిన పని లేదన్నాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ, అతడు కూడా ఒక మనిషేనని చెప్పాడు. ఏదో ఒక రోజు అతడు విఫలమవుతాడని, అది ఈ ఫైనలే అవ్వాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. బుమ్రాను ధాటిగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జియోహాట్స్టార్లో ఈ మ్యాచ్ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ క్రీడలోనైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంతమంది ఒకేసారి చూడటం ఇదే అత్యధికం. రేపు జరిగే ఫైనల్ ఈ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.
టీమిండియా- న్యూజిలాండ్ మధ్య రేపు ప్రపంచకప్ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు డివిలియర్స్, స్టెయిన్ ఫైనల్ విజేతగా నిలిచేది ఎవరో వెల్లడించారు. భారత్ ఛాంపియన్గా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అయితే, కివీస్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీమిండియా ఏదైనా పెద్ద తప్పిదం చేస్తే తప్ప, NZ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు.
రేపు న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని జట్టు నుంచి తొలగించి, అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని చెప్పాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మను ఫైనల్ మ్యాచ్లోనూ కొనసాగించాలని ఆయన సూచించాడు.
రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య T20 WC టైటిల్ పోరు జరగనున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు విమానయాన సంస్థలు శుభవార్త చెప్పాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్కు అదనపు ఫ్లైట్ సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియ ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ ప్రకటించాయి. అటు భారతీయ రైల్వే కూడా పలు ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ 3 ఫార్మాట్లలోనూ 1000+ రన్స్ చేసిన 2వ ప్లేయర్గా నిలిచింది. భారత్తో టెస్టులో ఈ ఘనత సాధించిన ఆమె.. ఇప్పటివరకు T20ల్లో 2201, వన్డేల్లో 4504, టెస్టుల్లో 1006 రన్స్ చేసింది. పెర్రీ కంటే ముందు చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG) T20ల్లో 1676, వన్డేల్లో 5992, టెస్టుల్లో 2605 రన్స్ చేసింది.
భారత్పై సెంచరీతో ఆకట్టుకున్న జాకబ్ బెథెల్(105) అరుదైన ఘనత సాధించాడు. ICC వైట్ బాల్ నాకౌట్స్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా మార్టిన్ గప్టిల్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ODI WC నాకౌట్స్లో గప్టిల్(2015లో 237*) టాప్ స్కోరర్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ(2000లో 141*)-సచిన్(1998లో 141). T20 WC నాకౌట్స్లో బెథెల్దే రికార్డ్.
ఇంగ్లండ్తో T20 WC సెమీస్లో చివరి ఓవర్ వేసేది తానే అని తెలిసినప్పడు కొంత భయమేసిందని శివమ్ దూబే పేర్కొన్నాడు. సెమీస్లో చివరి ఓవర్ అంటే సవాలేనని, మ్యాచ్ ఫలితాన్ని మార్చగల తొలి 2 బంతులపై చాలా ఫోకస్ చేశానని తెలిపాడు. ఇక 30 పరుగులను డిఫెండ్ చేసే క్రమంలో దూబే వేసిన తొలి బంతికే.. నిలదొక్కుకుని ఆడుతున్న బెథెల్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.
తొలి T20 WC ట్రోఫీ కోసం న్యూజిలాండ్ రేపు భారత్తో తలపడనుంది. INDతో T20ల్లో 18-11తో వెనకబడినా.. T20 WCలో తలపడిన 3 సందర్భాల్లోనూ ఆ జట్టుదే విజయం. పైగా కెప్టెన్ శాంట్నర్, రచిన్, సోధితో IND కంటే బలమైన స్పిన్ అటాక్ కివీస్ సొంతం. టోర్నీలో IND బ్యాటింగ్ సగటు 27.31 అయితే NZది 41.68. ఇంకా IND ప్లేయర్లు 11 సార్లు డకౌట్ కాగా NZ బ్యాటర్లు 2 సార్లే అలా వెనుదిరిగారు.
భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 96/3 స్కోరుతో తొలి రోజు ఆట ముగించిన ఆసీస్.. ఇంకా 102 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో పెర్రీ(43), అనాబెల్(20) ఉన్నారు. అటు తొలి ఇన్నింగ్స్లో హర్మన్ సేన 198 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్ చేయకుండా ప్రత్యర్థిని నిలువరించాలంటే.. ఇవాళ భారత్ ధాటిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.