ఇంగ్లండ్తో T20 WC సెమీస్లో చివరి ఓవర్ వేసేది తానే అని తెలిసినప్పడు కొంత భయమేసిందని శివమ్ దూబే పేర్కొన్నాడు. సెమీస్లో చివరి ఓవర్ అంటే సవాలేనని, మ్యాచ్ ఫలితాన్ని మార్చగల తొలి 2 బంతులపై చాలా ఫోకస్ చేశానని తెలిపాడు. ఇక 30 పరుగులను డిఫెండ్ చేసే క్రమంలో దూబే వేసిన తొలి బంతికే.. నిలదొక్కుకుని ఆడుతున్న బెథెల్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.