VSP: జ్ఞానాపురంలోని శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం మే 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సి.హెచ్. వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఆలయ అధికారులు, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.