AKP: పైడిపాల జంక్షన్లో వాహన తనిఖీల్లో బూరుగుపాలెం వైపు నుండి ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్ పై తరలిస్తున్న 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులు నీలంపేటకు చెందిన నడిపింటి సతీష్, గొలుగొండ మండలం రామచంద్రాపురంకి చెందిన కోలా రామ్ పండుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు.