AP: రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వివక్షను తొలగించి, మహిళలకు సమాన ఆర్థిక, సామాజిక అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం అన్నారు. గర్భధారణ నుంచి శిశు సంరక్షణ వరకు అండగా ఉంటూ.. జనాభా స్థిరీకరణలో వారిని భాగస్వాములను చేస్తామన్నారు. మహిళా శక్తితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు.