GDWL: భారతావనికి విశేష సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నడిగడ్డలో ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు లేకపోవడం వల్ల ఎస్టీ, బీసీ, మైనార్టీలు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.