NRPT: జిల్లాలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగులకు సంబంధం లేని పనులు చేయించడం తగదని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వారు హక్కుల గురించి మాట్లాడలేని పరిస్థితిని అధికారులు చేయరాదన్నారు. జిల్లా కలెక్టర్, డీపీవో స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.