VKB: కేటీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ప్రతిపక్షాలపై భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కాంగ్రెస్ గుండాయిజం సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలే త్వరలోనే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారనీ హెచ్చరించారు.