KRNL: పెద్దకడబూరు మండలంలో ప్రజా సమస్యలపై TDP రాష్ట్ర రైతు ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శశిరేఖ ఇవాళ జిల్లా కలెక్టర్ ఏ.సిరిని కలిశారు. కలెక్టర్ ఛాంబర్లో రైతుల ఇబ్బందులు, తాగునీరు, రహదారులు, సాగునీటి కొరత వంటి సమస్యలను వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోరారు. సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.