భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 96/3 స్కోరుతో తొలి రోజు ఆట ముగించిన ఆసీస్.. ఇంకా 102 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో పెర్రీ(43), అనాబెల్(20) ఉన్నారు. అటు తొలి ఇన్నింగ్స్లో హర్మన్ సేన 198 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్ చేయకుండా ప్రత్యర్థిని నిలువరించాలంటే.. ఇవాళ భారత్ ధాటిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.