NLR: నాయుడుపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం వద్ద ఆదివారం రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో పాల్గొనే నెల్లూరు జిల్లా జట్టుకు అండర్-19 విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సారథ్యంలో జరిగే ఈ పోటీలకు గురుకులం నుంచి 8 మంది, సూళ్లూరుపేట బాలికల గురుకులం నుంచి 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
VSP: ఆనందపురం హై స్కూల్ గ్రౌండ్లో సోమవారం నుంచి మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్.జి.ఎఫ్ మండల కో-ఆర్డినేటర్ వరప్రసాద్, పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు రామకృష్ణ పట్నాయక్ పేర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, చెస్ వంటి ఆటల పోటీలు ఉంటాయన్నారు. ఎంపికైన విద్యార్థులను నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తామని తెలిపారు.
VSP: తగరపువలస మండలం చిట్టివలస జడ్పీ బాలుర హైస్కూల్ ఆవరణలో సోమవారం నుంచి మూడురోజుల పాటు మండలస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటలపోటీలు జరుగనున్నాయి. అండర్-14, 17 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా జరిగే ఈ పోటీలలో యోగా, కబడ్డీ, చెస్, ఖోఖో, బాడ్మింటన్, వాలీ బాల్, అథ్లెటిక్స్ నిర్వహించనున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
WG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను పాలకోడేరు మండలం మోగల్లు జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు త్రినాథ్ తెలిపారు. నాలుగు మండలాల్లో పలు పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయంలో అశ్విన్, జడేజా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జడేజా గురించి అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జడేజాది చాలా స్ఫూర్తిదాయకమైన జీవితం. అతను బ్యాటింగ్కు వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ రూంలో నేను చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. జడేజా బ్యాటుతో, బంతితో బెంబేలెత్తించగలడు. ఫీల్డింగ్లో చురుగ్గా ఉంటాడు. అందుకే అతడంటే అసూయ. అలాగే అభి...
NLR: బుచ్చి పట్టణం అరుంధతి వాడలో వినాయక చవితి 16 రోజు పండుగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మూడో వార్డు కౌన్సిలర్ అందే ప్రత్యూష విజ్ఞేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన బాలబాలిలకు కౌన్సిలర్ అందే ప్రత్యూష బహుమతులను అందజేశారు.
బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్ 2024 టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది. ఓపెన్ విభాగంలో తొలిసారి గోల్డ్ మెడల్ సాధించింది. స్లోవేనియా జట్టుతో జరిగిన ఈ మ్యాచులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. స్వర్ణం సాధించిన భారత జట్టులో ప్రజ్ఞానంద, డీ.గుకేష్, అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణన్ ఉన్నారు. కాగా 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత్ జట్టుకు ...
వన్డే క్రికెట్లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇంగ్లాడ్తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో ఆసీస్ వరుసగా రెండో విజయం సాధించింది. దీంతో వన్డేలలో ఆ జట్టుకు ఇది వరుసగా 14వ విజయం. దీంతో వన్డే క్రికెట్లో వరుసగా అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాగా 2003లో 21 వరుస విజయాలతో ఆస్ట్రేలియానే అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డ్...
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)లో భారత రెజ్లర్ సంగ్రామ్ సింగ్ తన అరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించాడు. MMA ఫైట్లో నెగ్గిన తొలి భారత పురుష రెజ్లర్గా ఘనత సాధించాడు. జార్జియాలో జరుగుతున్న గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో 93 కేజీల కేటగిరీలో పాకిస్తాన్ ఫైటర్ అలీ రజా నాసిర్ను చిత్తు చేశాడు. ఫైట్ అనంతరం సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ గెలుపు వ్యక్తిగత విజయం కంటే చాల...
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించడంపై జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘‘అద్భుతమైన ఆరంభం. బాగా ఆడారు అబ్బాయిలు’’ అని పోస్ట్ చేశాడు. కాగా ఈ మ్యాచులో 515 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా కేవలం 234 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో రాణించాడు. దీంతో రోహిత్ సేన 280 పరుగుల ...
బంగ్లాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో మూడో స్థానంలో వచ్చిన గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సెంచరీతో అతడి స్థానంపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. “నేను ఈ స్థానంలో ఆడగలననే నమ్మకం ఎప్పుడూ ఉంది. ఏ స్థానంలో ఆడామన్నది విషయం కాదు. ప్రదర్శన ఎలా ఉందనేదే ముఖ్యం. ఇండియా A, రంజీల్లో 5, 4, 3 స్థానాల్లో కూడా పరుగులు చేశాను. ఓపెనింగ్లో కూడా రాణిస్త...
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా A నిలిచింది. ఇండియా Cతో జరిగిన మ్యాచులో 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండు విజయాలతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చిన ఇండియా A టైటిల్ సొంతం చేసుకుంది. 350 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా C 217 పరుగులకు ఆలౌటైంది. ఇండియా A తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులు.. రెండో ఇన్నింగ్స్లో 286 పరుగ...
SKLM: ఇండోనేషియా దేశంలో జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు చాపర పూర్ణారావు విజయం సాధించాడు. ఇటీవలె విదేశాలలో జరుగుతున్న పోటీలకు వెళ్లేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆయనకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ చొరవతోనే పోటీలలో పాల్గొన్నారు.
బ్యాటింగ్ వైఫల్యంతోనే తొలి టెస్టులో ఓడామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ అన్నాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని.. కానీ బ్యాటింగ్ విభాగం రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. అశ్విన్, జడేజా అద్భుత భాగస్వామ్యంతో భారీ స్కోర్ చేసిందన్నాడు. తాము ఓడినా కొన్ని సానుకూలాంశాలు లభించాయని. తర్వాతి టెస్టులో తమ బ్యాటర్లు కూడా సత్తా చాటుతారని ఆశిస...
కొంతకాలంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత మాజీ దిగ్గజం రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. స్పిన్ బౌలింగ్లో భయపడొద్దని, ఎదురుదాడికి దిగాలని సూచించాడు. అతను తన పాదాలను మరింత ఎక్కువగా ఉపయోగించాలని.. స్వీప్ షాట్లు ఆడాలని అన్నాడు. సమయానికి తగ్గట్లు కదులుతూ షాట్ ఆడటానికి భయపడొద్దని చెప్పాడు. బౌలర్లను భయపెట్టేలా ఎదురుదాడికి దిగాలని.. గతంలో కోహ్లీ అల...