ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. అయితే మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుతో యువ పేసర్ మయాంక్ యాదవ్ను తీసుకెళ్లాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ చెలరేగుతాడని.. ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయకపోవడంపై పెద్దగా ఆందోళన చెం...
భారత బ్యాట్స్మెన్ రిషబ్ పంత్పై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గిల్క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత రీ ఎంట్రీలో పంత్ ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేయడాన్ని గ్రేటెస్ట్ కంబ్యాక్గా గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. పంత్ బ్యాటింగ్ తనకంటే చాలా దూకుడుగా ఉంటుందని.. అతడు భయం లేకుండా ఆడే విధానం తనకు చాలా నచ్చుతుందని తెలిపాడు.
ప్రో కబడ్డీ సీజన్-11కు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. అక్టోబర్ 18న ప్రారంభంకానున్న ఈ టోర్నీలో హైదరాబాద్ వేదికగా ఆరంభ మ్యాచులు జరగనున్నాయి. ఈసారి టోర్నీని 3 నగరాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడా, డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణే వేదికగా మ్యాచులు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ మ్యాచులను లీగ్ ...
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 359 మ్యాచ్లలో 18,213 పరుగులు సాధించాడు. 165 వన్డేల్లో 6,810 పరుగులు, 101 టెస్ట్ల్లో 8,828 పరుగులు, 93 T20ల్లో 2,575 పరుగులు చేశాడు. కాగా ఈ రికార్డ్ ఇంతకు ముందు రాస్ టే...
టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. చెన్నై వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్లు తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ సంవత్సరం బుమ్రా మొత్తంగా 14 మ్యాచులు 20 ఇన్నింగ్స్ల్లో 47 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో హాంగ్ కాంగ్ బౌలర్ ఎహ్సన్ ఖాన్ 46 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. శ్రీలంక బౌలర్ హసరంగా 43 [&he...
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో బ్యాటర్ కేఎల్ రాహుల్ను మరికొంత సమయం ఆడిస్తే బాగుండేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘ఇంకా రోజున్నర సమయం మిగిలింది. అలాంటి సమయంలో 19 బంతుల్లో 22 పరుగులు చేసిన దూకుడు మీదున్న రాహుల్ను మరికొద్ది సేపు ఆడించాల్సింది. అతనిని 60-70 పరుగులు చేసేందుకు ఛాన్స్ ఇస్తే బాగుండేది. అదేమీ మొత్తం మ్యాచుపై ప్రభావం చూపదు’ అని అన...
బంగ్లాదేశ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సాధించాడు. ఫస్ట్ ఇన్నింగ్లో 86 పరుగులు చేసిన జడేజా.. ఇన్నింగ్ మొత్తంలో 5 వికెట్లు తీశారు. ఇలా ఒక టెస్ట్లో అర్ధ సెంచరీ చేసి ఐదు వికెట్లు తీయడం ఇది 12వ సారి. దీంతో ఎక్కువ సార్లు ఈ ఫిట్ సాధించిన ఘనత జడేజాకు దక్కింది. ఆ తర్వాత స్థానంలో అశ్విన్ (11) ఉన్నాడు.
క్రికెట్లో ఎవరు బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అనే దానిపై ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. టీమిండియా పేసర్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ ఫాస్ట్ బౌలరని కొనియాడాడు. నవంబర్ 22 నుంచి జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలంటే బుమ్రానే కీలకమన్నాడు. బంతి కొత్తదైనా, పాతదైనా బుమ్రా ఎంతో నైపుణ్యంతో బౌలింగ్ చేస్తాడని అన్నాడు. ఏ ఫార్మాట్లో అయిన అతనిని ఎదుర్క...
రెండు టెస్టుల సిరీస్లో భాగంగా శ్రీలంక వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో లంక 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో లంక 305 పరుగులు చేయగా.. కివీస్ జట్టు 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్లో లంక 309 పరుగులతో రాణించండంతో 275 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 211 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 124 బంతుల్లోనే తన ఆరో సెంచరీని సాధించాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ధోనీ కంటే పంత్ బెటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వీటిపై తాజాగా దినేశ్ కార్తిక్ స్పందించారు. వారిద్దరిని పోల్చడం సరైంది కాదని.. ఇంకాస్త సమయం ఇవ్వాల...
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బంగ్లాదేశ్తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 124 బంతుల్లోనే తన ఆరో సెంచరీని సాధించాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ధోనీ కంటే పంత్ బెటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వీటిపై తాజాగా దినేశ్ కార్తీక్ స్పందించారు. వారిద్దరిని పోల్చడం సరైంది కాదని.. ఇంకాస్త సమయం ఇవ్వాల...
ఆఫ్ఘనిస్థాన్పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మూడు వన్డే సిరీస్లలో రెండు ఓడిపోయిన సౌతాఫ్రికా క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్లో 169 పరుగులకే ఆఫ్ఘనిస్థాన్ కుప్పకూలింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆఫ్ఘన్ జట్టులో రెహ్మానుల్లా గుర్బాజ్ 89, అల్లా గజన్ఫర్ 31 మాత్రమే రాణించారు.
ఇటీవల జరిగిన భారత్-బంగ్లాదేశ్ టెస్టుకు మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అభినవ్ తొలిసారి ఇలాంటి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన నానమ్మ చనిపోయి 24 గంటలు గడవకముందే మళ్లీ కామెంట్రీ చేసేందుకు వచ్చానని వెల్లడించారు. తన నిర్ణయంపై నాన్నమ్మ సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. నికోలస్ పూరన్ 43 బంతుల్లో 93 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో.. 18.3 ఓవర్లలో...
చెస్ ఒలింపియాడ్లో భారత్ చరిత్ర సృష్టించింది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత్ రెండు స్వర్ణాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. 2014, 2022లో పురుషుల జట్టు, 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలవడమే అత్యుత్తమ ప్రదర్శన. కాగా, 45వ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు పసిడి సాధించి....