• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

అభిషేక్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు టీమిండియా బౌలింగ్ కోచ్ పూర్తి మద్దతు ప్రకటించాడు. అభిషేక్ ఫామ్‌పై జట్టులో ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. అతని సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అభిషేక్ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడని, త్వరలోనే అతను భారీ స్కోర్లతో ఫామ్‌లోకి వస్తాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 08:18 PM IST

సఫారీలపై టీమిండియాదే పైచేయి

T20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్లు మరోసారి కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు T20 WC చరిత్రలో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడగా, భారత్ 5 సార్లు విజయం సాధించి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2024 ఫైనల్లో సఫారీలను చిత్తు చేసి భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో 22న జరిగే మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ చేయాలని టీమిండియా భావిస్తోంది.

February 20, 2026 / 08:00 PM IST

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనలిస్ట్‌లు వీరే..!

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరే జట్లేవో భారత్ మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని తెలిపారు. ప్రస్తుత ఆటగాళ్ల ఫామ్, టీమ్ బ్యాలెన్స్ ఆధారంగా ఈ నాలుగు జట్లు ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీమిండియా ఈసారి కచ్చితంగా ఫైనల్ చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

February 20, 2026 / 07:36 PM IST

T20 WC: ఒమన్‌పై టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఒమన్: అమీర్ కలీమ్, జతీందర్ సింగ్(సి), కరణ్, మీర్జా, వసీం అలీ, నదీమ్, వినాయక్(w), రామానంది, ఒడెద్రా, షకీల్, షఫీక్AUS: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్రీన్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (w), మాట్ రెన్షా, మాక్స్‌వెల్, స్టోయినిస్, బార్ట్‌లెట్, ఎల్లిస్, జంపా

February 20, 2026 / 06:40 PM IST

అభిషేక్, ఇషాన్ కంటే అతడే డేంజర్: గవాస్కర్

స్పిన్నర్లకు శివం దూబే సింహస్వప్నంగా మారాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బంతి ఎక్కడ పడినా, దానిని స్టాండ్స్‌లోకి పంపే సామర్థ్యం దూబేకు ఉందని కొనియాడాడు. దీనివల్ల అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియక బౌలర్లు తలపట్టుకుంటున్నారని అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కంటే కూడా దూబే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని పేర్కొన్నాడు.

February 20, 2026 / 05:15 PM IST

మహేష్ బాబు అంటే ఇష్టం: టీమిండియా క్రికెటర్

టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దూబే మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. మహేష్ బాబు అత్యంత హ్యాండ్‌సమ్ హీరో అంటూ కొనియాడాడు. అలాగే, అల్లు అర్జున్ కూడా తనకు ఇష్టమని, ఆయన నటించిన ‘పుష్ప’ సినిమా బాగా నచ్చిందని పేర్కొన్నాడు.

February 20, 2026 / 05:00 PM IST

T20 WC చరిత్రలో ఇదే మొదటిసారి

2026 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ ముగిసే సమయానికే మూడు సెంచరీలు (నిస్సంక, యువరాజ్ సమ్రా, ఫర్హాన్) నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో మూడు సెంచరీలు నమోదు కావడం ఇదే మొదటిసారి. టోర్నీ సగం కూడా పూర్తికాకముందే మూడు సెంచరీలు నమోదు కావడంతో, ఈ మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సెంచరీలు నమోదవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

February 20, 2026 / 04:46 PM IST

కోహ్లీ లాంటి ప్లేయర్ మాకు లేడు: కమిన్స్

విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా కోహ్లీకి ఉందని కొనియాడాడు. ఆసీస్ జట్టులో కోహ్లీ వంటి ఆటగాడు లేడని, అందుకే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడికి లోనై ఓడిపోయామని పేర్కొన్నాడు. విరాట్ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయని వ్యాఖ్యానించాడు.

February 20, 2026 / 04:22 PM IST

ఫైనల్‌ల్లో భారత్ VS బంగ్లాదేశ్

‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ 16.4 ఓవర్లలో కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.

February 20, 2026 / 03:37 PM IST

T20 WC: ఆసీస్‌కు పసికూన సవాల్

T20 WCలో ఈరోజు ఆస్ట్రేలియాతో ఒమన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడిలో ఉందని, ఆ జట్టును ఓడించడానికి తమకు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పసికూన ఒమన్, ఆస్ట్రేలియాను ఓడిస్తామనడం.. ఆ జట్టుకు సవాల్ విసిరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

February 20, 2026 / 03:23 PM IST

టీమిండియా ప్రదర్శనపై అశ్విన్ అసంతృప్తి

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నట్లు ఆయన తెలిపాడు. ఇక బౌలింగ్‌లో చక్రవర్తి మరోసారి తన స్పిన్ మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడని చెప్పాడు. టీ20ల్లో షాట్లు ఆడటమే కాదు, బంతిని టైమ్ చేస్తూ గ్యాప్స్‌లోకి ఆడటం కూడా ముఖ్యమన్నాడు.

February 20, 2026 / 03:08 PM IST

టీమిండియాలో గేమ్ ఛేంజర్స్ వారే: పొలాక్

సూపర్-8లో భాగంగా ఈనెల 21న భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ షాన్‌ పొలాక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండు జట్లలోనూ అద్భత ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అయితే, బుమ్రా, వరుణ్ చక్రవర్తి టీమిండియాలో గేమ్ ఛేంజర్స్ అని వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో పోలిస్తే భారత్ జట్టు కాస్తా మెరుగ్గా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు.

February 20, 2026 / 02:55 PM IST

సూపర్‌-8లోనూ విజయాలు సాధిస్తాం: రజా

టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. గ్రూప్‌ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇదే ప్రదర్శనను సూపర్-8లో కొనసాగిస్తామని పేర్కొన్నాడు. S-8లో ఈనెల 23న వెస్టిండీస్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 02:23 PM IST

‘ది హండ్రెడ్’లో పాక్ ప్లేయర్లకు ‘నో’!

2008 ముంబై దాడుల తర్వాత 2009 నుంచి IPLలో పాక్ ప్లేయర్లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్-‘ది హండ్రెడ్’లో కూడా పాక్ ప్లేయర్లను తీసుకునేందుకు 8 ఫ్రాంచైజీలలో 4 నిరాకరిస్తున్నాయట. ఈ MSG, MI లండన్, సథరన్ బ్రేవ్(క్యాపిటల్స్), సన్‌రైజర్స్ లీడ్స్‌లకు ఓనర్స్ IPL ఫ్రాంచైజీలే కావడం ఇందుకు కారణం. అందుకే SA20లోనూ నసీం షా, మహ్మద్ నవాజ్ మినహా ఎవరూ ఆడలేదు.

February 20, 2026 / 01:42 PM IST

పాక్ మాటలు నమ్మి మోసపోయాం: బంగ్లా

పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మాటలు నమ్మడం వల్లే T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిందని BCB జనరల్ సెక్రటరీ సయ్యద్ అష్రాఫుల్ హక్ సంచలన ఆరోపణలు చేశారు. తమ బోర్డ్ చీఫ్ అమీనుల్ ఇస్లామ్‌ను నఖ్వీ రెచ్చగొట్టారని.. ఆయన మాటలు విని ఎవరు మాత్రం గెలిచారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా భారత్ తమ ప్లేయర్లకు సేఫ్ కాదంటూ బంగ్లా టోర్నీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

February 20, 2026 / 12:34 PM IST