నెదర్లాండ్స్తో మ్యాచ్లో టీమిండియా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నట్లు ఆయన తెలిపాడు. ఇక బౌలింగ్లో చక్రవర్తి మరోసారి తన స్పిన్ మ్యాజిక్తో ఆకట్టుకున్నాడని చెప్పాడు. టీ20ల్లో షాట్లు ఆడటమే కాదు, బంతిని టైమ్ చేస్తూ గ్యాప్స్లోకి ఆడటం కూడా ముఖ్యమన్నాడు.