‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్పై బంగ్లాదేశ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ 16.4 ఓవర్లలో కేవలం 56 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఆదివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.