తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టు కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లోనూ విఫలమవడంతో ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంగళవారం భారత ఆటగాళ్లు నెట్ సెషన్స్లో పాల్గొనగా.. మిగతా వారి కంటే రోహిత్ శర్మ, పంత్ గంట ముందే ప్రాక్టీస్ ప్రారంభించారు. కాగా భారత్- ఆసీస్ మధ్య రెండో టెస్టు ఈ నెల 6న ప్రారంభం కాన...
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న యువ క్రికెటర్ పృథ్వీషాకు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఓ సలహా ఇచ్చాడు. ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ అన్సోల్డ్గా మిగిలిన పృథ్వీకి మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచించాడు. పృథ్వీషా విజయవంతం కావాలని కోరుకునే శ్రేయోభిలాషులు ఉంటే అతన్ని సోషల్ మీడియాకు దూరం ఉండమని చెప్పాలన్నాడు.
ప్రకాశం: జిల్లా సంతనూతలపాడులో వర్షాల ప్రభావంతో స్థానిక జడ్పీ హెచ్ఎస్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తేదీలను మార్పు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 5 నుంచి 8 వరకు స్థానిక జడ్పీహెచ్ఎస్లో నిర్వహించాల్సి ఉండగా, తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 7 నుంచి 10 తేదీ వరకు మార్పులు చేసినట్లు తెలిపారు.
భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరిగిన ఏడో గేమ్ డ్రాగా ముగిసింది. ప్రపంచ టైటిల్ మ్యాచ్లో ఇప్పటివరకు ఏడు గేమ్లు జరగ్గా ఐదు డ్రా అయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఇద్దరు 3.5 – 3.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు.
ముంబయిలోని ప్రసిద్ధ శివాజీ పార్క్లో రమాకాంత్ ఆచ్రేకర్ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ హాజరై తన చిన్ననాటి కోచ్ స్మారకాన్ని ఆవిష్కరించారు. తాను క్రికెట్లో గొప్ప స్థాయికి ఎదగడానికి ఆచ్రేకర్ కూడా కారణమని గుర్తుచేసుకున్నారు. ఆచ్రేకర్ను ఆల్-రౌండర్గా పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య ఈనెల 6 నుంచి అడిలైడ్లో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే, స్టార్ బ్యాటర్ కోహ్లీ మోకాలికి బ్యాండేజీ వేసుకుని ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కోహ్లీ రెండో టెస్టులో ఆడతాడా? లేదా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
38వ జాతీయ క్రీడలకు ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడలకు సంబంధించి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) క్రీడల తేదీ, జాబితాను విడుదల చేసింది. ఉత్తరాఖండ్లో 28 జనవరి 2025 నుంచి 14 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఈ పోటీల్లో IOA 32 ఒలింపిక్ క్రీడలతోపాటు ఉత్తరాఖండ్లోని మల్కామ్, యోగాసన్, రాఫ్టింగ్, కలరియట్టు క్రీడలను చేర్చింది.
విజయవాడలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను శాప్ ఛైర్మన్ రవినాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస కేంద్రాలను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. 2027 జాతీయ క్రీడలు నిర్వహించే దిశగా కార్యచరణ చేస్తున్నామన్నారు.
టీ20 క్రికెట్లో గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తాచాటుతున్నాడు. ఉత్తరాఖండ్పై 36 బంతుల్లో సెంచరీ చేశాడు. అలాగే, నవంబర్ 27న త్రిపురపై 28 బంతుల్లోనే శతకం బాదేశాడు. దీంతో టీ20 క్రికెట్లో 40 బంతులలోపే రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా, రూ.30 లక్షల కనీస ధరలో ఐపీఎల్ మెగా వేలంలో ఉర్విల్ అన్&zw...
బ్రిటన్కు చెందిన ప్రపంచ స్నూకర్ మాజీ ఛాంపియన్ టెర్రీ గ్రిఫిత్ కన్నుమూశారు. వయోభార సంబంధిత అనారోగ్య సమస్యలతో 77 ఏళ్ల గ్రిఫిత్ నిన్న కన్నుమూసినట్లు ఆయన కుమారుడు వేన్ సోషల్ మీడియాలో తెలిపాడు. కాగా బస్ కండక్టర్గా, పోస్ట్మన్గా పనిచేసిన గ్రిఫిత్ 1978లో ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్గా ఎదిగి 1979లోనే ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచి దిగ్గజ ప్లేయర్గా చరిత్రలో నిలిచాడు.
AUSతో మొదటి టెస్టు ఆడలేకపోయిన రోహిత్ శర్మ.. రెండో టెస్టు అడేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో తొలి టెస్టులో ఓపెనింగ్ స్థానంలో వచ్చిన రాహుల్ రాణించడంతో రోహిత్ ఏ స్థానంలో బ్యాటింగ్కి వస్తాడనేది సందిగ్ధంగా మారింది. AUS ప్రైమ్ మినిస్టర్II తో జరిగిన మ్యాచ్లో రోహిత్ మిడిలార్డర్లో బరిలో దిగడంతో రెండో టెస్టులో కూడా మిడిలార్డర్లోనే ఆడతాడా ? అనేది ఆసక్తికరంగా మారింది.
భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనెల 22న పీవీ సింధుకు హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయితో వివాహం జరగనుంది. వరడు వెంకట దత్తసాయి ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని సింధు తండ్రి తెలిపారు. నెల రోజుల క్రితమే ముహూర్తం ఖాయం చేశామని, జనవరిలో సింధుకు బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈ నెలలోనే వివాహం జరిపిం...
భారత జట్టు ఏదైనా పెద్ద సిరీస్ ఆడుతుంటే అందరి దృష్టి స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్లపైనే ఉంటుంది. కానీ ఇప్పుడు.. పెర్త్ టెస్టులో తన అసాధారణ బౌలింగ్తో INDకు విజయాన్ని అందించిన స్టార్ పేసర్ బుమ్రా పేరు మార్మోగుతోంది. ఎక్కడ చూసినా అతని నామస్మరణే. ఆసీస్ స్టార్ క్రికెటర్లు సైతం అతని బౌలింగ్ను ఎదుర్కోవడం చాలా కష్టం అంటూ.. కొనియాడుతున్నారు. బుమ్రా ప్రపంచంలోనే గ్రేటెస్ట్ బౌలర్ అం...
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా లాంటి గ్రేట్ బౌలర్ను ఎదుర్కొన్నానని తన మనవళ్లకు చెబుతానని వెల్లడించాడు. క్రికెట్ చరిత్రలోనే గ్రేట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా కెరీర్ను ముగిస్తాడు. అతన్ని ఎదురుకోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో తాము చుస్తున్నామన్నాడు. తనతో ఆడటం బాగుంది అని పేర్కొన్నాడు.
KMM: జిల్లాలో ఈనెల 7నుంచి సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. ఈనెల 7,8 తేదీలలో గ్రామస్థాయిలో, 10,12తేదీలలో మండల, మున్సిపల్ స్థాయిలో, 16 నుంచి 21 జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు.