WWCలో భాగంగా రేపు సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో హర్మన్ప్రీత్ సేన గెలిస్తే BCCI భారీ బొనాంజా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పురుషుల జట్టుతో సమానంగా భారీ నజరానా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ సేనకు బోర్డు రూ.125 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది. ఇప్పుడు మహిళలకు కూడా అంతే మొత్తం ఇవ్వనున్నట్లు సమాచారం.