కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ టెస్టుల్లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. తన ఫామ్పై మాట్లాడిన విరాట్.. గత 3 ఇన్నింగ్స్ల్లో అనుకున్న విధంగా ఆడలేకపోయానన్నాడు. మెల్బోర్న్ తనకు చాలా స్పెషల్.. ఇక్కడ చాలా పరుగులు చేశానని, తన ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నదన్నాడు. తిరిగి పుంజుకోవడానికి MCG సరైన వేదిక అని భావిస్తున్నానని పేర్కొన్నాడు.
మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్లో AUS ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ కొన్స్టస్ అరంగేట్రం మ్యాచులోనే బౌలర్లపై విరుచుకుపడుతూ సూపర్ ఫిఫ్టీ (60) సాధించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నా అతడు ఏకంగా బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదడం గమనార్హం. క్రీజులో ఖవాజా (38), లబుషేన్(12) ఉన్నారు. లంచ్ సమయానికి AUS స్కోర్ 112/1.
మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్లో AUS ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ కొన్స్టస్ అరంగేట్రం మ్యాచులోనే బౌలర్లపై విరుచుకుపడుతూ సూపర్ ఫిఫ్టీ (60) సాధించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నా అతడు ఏకంగా బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదడం గమనార్హం. క్రీజులో ఖవాజా (38), లబుషేన్(12) ఉన్నారు. లంచ్ సమయానికి AUS స్కోర్ 112/1.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మట్కు వీడ్కోలు పలికాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తన విరమణపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడంతో తాజాగా స్పందించాడు. తనకు ఎవరిపై కోపం లేదని, తన రిటైర్మెంట్కు ఎవరూ బాధ్యులు కాదని స్పష్టం చేశాడు.
SKLM: పిఠాపురంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో సీనియర్ మెన్ బ్యాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీల్లో శ్రీకాకుళానికి చెందిన జ్ఞానేశ్వర్ రావు, అప్పలరాజు, హేమంత్ కుమార్ బంగారు పతకాలు సాధించారు. అలాగే వెండి పతకాలను విశేశ్వరరావు, లోకేష్, ఏసు, శ్రీకాంత్, మనోజ్ దక్కించుకున్నారు. ఈ మేరకు బుధవారం పథకాలు సాధించిన వారికి SKLM ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందించారు.
W.G: ఇంటర్ కాలేజియేట్ బెస్ట్ ఫిజిక్ టోర్నమెంట్లో పాలకొల్లు ఎఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి జగదీష్ ద్వితీయ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి తెలిపారు. జగదీష్ రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈనెల 21న జరిగిన ఇంటర్ కాలేజియేట్ బెస్ట్ ఫిజిక్ టోర్నమెంట్ పాల్గొని ప్రతిభ కనబర్చాడు. జగదీష్ ని ప్రిన్సిపల్ అభినంధించారు.
టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నాడు. సతీమణి సాక్షి, కూతురు జీవాతో శాంటాక్లాజ్ గెటప్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ధోనీకి కూతురు జీవా ఆప్యాయంగా ముద్దుపెట్టిన ఫొటోలు వైరల్గా మారాయి.
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో తన నంబర్ 1 స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో బుమ్రా (904) పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన భారత బౌలర్గా ఆశ్విన్ రికార్డును సమం చేశాడు. కాగా, అశ్విన్ 2016లో ఈ ఘనత సాధించాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్లో రికార్డు నమోదు చేశాడు. టీ20, వన్డే మ్యాచుల్లో 50 వికెట్లు తీసిన మైలురాయిని చేరుకున్నాడు. 41 మ్యాచుల్లో 51 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. గత రెండు టెస్టుల్లో మిడిలార్డర్లో ఆడి దారుణంగా విఫలమవడంతో రేపటి మ్యాచ్లో జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. దీంతో ఫామ్లో ఉన్న రాహుల్ వన్ డౌన్ ఆడనున్నాడు. మరోవైపు నితీష్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన భర్త వెంకట దత్త సాయితో తన ప్రేమ గురించి పలు ముచ్చట్లు మీడియాతో పంచుకుంది. వెంకట సాయి దత్తను చూడాగానే ప్రేమలో పడిపోయానని వెల్లడించింది. రెండేళ్ల క్రితం తనతో చేసిన విమాన ప్రయాణంతోనే తమ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందని చెప్పింది. ఆ క్షణం లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా అనిపించిందని పేర్కొంది.
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్ను కోహ్లీతో పోలుస్తూ తాను పెట్టిన పోస్టుపై పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్ స్పందించాడు. తన ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారని, PCBని విమర్శించలేదని చెప్పాడు. అది కేవలం తన అభిప్రాయమని, బాబర్కు మద్దతుగా పోస్ట్ పెట్టానని తెలిపాడు. కాగా, గతంలో బాబర్ను పక్కన పెడుతూ PCB తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ అతను పోస్టు పెట్టాడు.
విరాట్, స్మిత్లపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. మెల్బోర్న్లో జరిగే నాలుగో టెస్టులో వారిద్దరూ రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ ప్రస్తుతం విరాట్, స్మిత్ నిలకడలేని ఆటతీరుతో ర్యాకింగ్స్లో పడిపోయారు. ఇప్పటికీ వారు పరుగుల దాహంతో ఉన్నారు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే భారీ ఇన్నింగ్స్లు ఆడగలరు’ అని పేర్కొన్నాడు.
మెల్బోర్న్ వేదికగా రేపు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 43 బాక్సింగ్ డే టెస్టులు జరగగా.. ఆసీస్ (26), టీమిండియా (9)మ్యాచులను గెలిచాయి. అయితే వరుసగా 2018, 2020లో భారత్ గెలిచింది. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లోనూ భారత్ గెలిచి.. హ్యాట్రిక్ కొడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
టీమిండియాతో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు రెండు మార్పులతో కూడిన తుది జట్టును ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రకటించాడు. ఇందులో శామ్ కాన్స్టాస్, బోలాండ్లు చోటు దక్కించుకున్నారు.జట్టు: ఖవాజా, శామ్ కాన్స్టాప్, లబుషెన్, స్మిత్,హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ(WK), పాట్ కమ్మిన్స్(C), స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.