ADB: రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న, శ్రావణి జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు ఎంపికయినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్య దర్శి నారాయణరెడ్డి తెలిపారు. స్వప్న రాష్ట్ర మహిళా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుందన్నారు. ఆయనతో పాటు పలువురు వారిని అభినందించారు.
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతుంది. టీ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో లబుషేన్ (65*), పాట్ కమిన్స్ (21*) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు తీశారు.
టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. ఓవరాల్గా నాలుగో పేసర్గా బుమ్రా నిలిచాడు. ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత బుమ్రా ఈ రికార్డును సాధించాడు. కెరీర్లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200+ వికెట్ల మార్క్ను అందుకొన్నాడు.
HYD: గచ్చిబౌలీ బాలయోగి స్టేడియంలో జాతీయ మాస్టర్స్ అథ్లెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మాస్టర్స్ క్రీడ పోటీలు జనవరి 4, 5వ తేదీన నిర్వహించనున్నట్లు మాస్టర్స్ అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల సైతం పాల్గొంటారన్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఆసీస్ 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఖవాజా 21, కొన్స్టాప్ 8, స్మిత్ 13, హెడ్ 1, మార్ష్ 0, కారే 2 స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. క్రీజులో లబుషేన్(43*), కమిన్స్ ఉన్నారు. ప్రస్తుతం 196 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది.
NRML: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ప్రకటనలో తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో సారంగాపూర్ కళాశాలకు చెందిన వర్షిని బంగారు పతకం,102 కిలోల విభాగంలో దస్తురాబాద్ మండలం ప్రభుత్వ పాఠశాలకు చెందిన అభిషేక్ కాంస్య పతకం సాధించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్నటెస్టు మ్యాచ్లో నాలుగో రోజు తొలి సెషన్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(21), కొన్స్టాప్(8) వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 53/2 స్కోరు చేసింది. క్రీజులో లబుషేన్(20), స్మిత్(2) ఉన్నారు. బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా 158 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో నాలుగో రోజు టీమిండియా 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 105 పరుగులకు చేరింది. భారత బ్యాటర్లలో నితీష్ 114, జైస్వాల్ 82, సుందర్ 50 రన్స్తో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమీన్స్, బొలాండ్ లయన్కు తలో 3 వికెట్లు పడగొట్టారు. నిన్నటి స్కోర్కు కేవలం 11 పరుగులు మాత్రమే జోడించి భారత జట్టు ఆలౌట్ అయింది.
WNP: అమరచింత మండల కేంద్రంలోని స్థానిక విజేత మోడల్ స్కూల్ విద్యార్థిని నిక్షిత ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన జూనియర్ కబడ్డీ మీట్లో చక్కటి ప్రతిభ కనబరిచి తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం వనపర్తి జిల్లా కబడ్డీ సంఘం సెక్రటరీ రాము, అడిషనల్ సెక్రటరీ కురుమూర్తి క్రీడాకారిణి నిక్షితను సత్కరించి అభినందించారు.
ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ నామినేట్ చేయబడింది. ఆమెతో పాటు సస్కియా హార్లీ(స్కాట్లాండ్), అన్నరీ డెర్క్సెన్(దక్షిణాఫ్రికా), ఫ్రెయా సార్జెంట్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారిణిగా శ్రేయాంక డిసెంబర్ 2023లో చరిత్ర సృష్టించింది.
ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ నామినేట్ చేయబడింది. ఆమెతో పాటు సస్కియా హార్లీ(స్కాట్లాండ్), అన్నరీ డెర్క్సెన్(దక్షిణాఫ్రికా), ఫ్రెయా సార్జెంట్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్న తొలి భారతీయ క్రీడాకారిణిగా శ్రేయాంక డిసెంబర్ 2023లో చరిత్ర సృష్టించింది.
PDPL: రాష్ట్రస్థాయి సీఎం కప్ ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వరంగల్లో రిపోర్ట్ చేయాలని పెద్దపల్లి జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి సురేశ్ తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు పోటీలు జరుగుతాయన్నారు. పెద్దపల్లి జిల్లా తరఫున క్రీడాకారులకు టీషర్ట్స్, బస్సు పాసులు ఇస్తామన్నారు. వివరాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
SRCL: సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల మోడల్ స్కూల్ విద్యార్థిని జి. శరణ్య ఎంపికయింది. శనివారం శరణ్యను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాధ, పీఈటీ స్వాతి, ఇతర అధ్యాపక బృందం అభినందించింది. ఇటీవల జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు శరణ్య ఎంపికైంది.
KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అనిల్, ప్రవీణ్, అర్చన, సాయితేజలు జిల్లాస్థాయిలో సాఫ్ట్ బాల్ పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈనెల 27-29 తేదీలలో మెదక్ జిల్లాలో రాష్ట్రస్థాయి సీఎం పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సరిత తెలిపారు. సరిత మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో గెలుపొంది మోడల్ స్కూల్ ప్రతిభను చాటాలన్నారు.
ఖమ్మం: సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగియనున్నట్లు డీవైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజులుగా ఆడిన జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పోటీలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.