ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. సంజూ శాంసన్ 89 పరుగులతో విధ్వంసం సృష్టించగా, దూబే (43), కిషన్ (39) మెరుపులు మెరిపించారు. చివర్లో పాండ్యా (27), తిలక్ (21) కూడా ధాటిగా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 253/7 పరుగులు చేసింది. సూర్య(11), అభిషేక్ (9) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు.