KRNL: బేతంచెర్లలోని అమ్మవారి శాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవీ మహిళా మండలి సభ్యులతో కలిసి 46 మంది దంపతులు సామూహిక హోమంలో పాల్గొన్నారు. ముందుగా జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.