సౌతాఫ్రికాతో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ స్పందిస్తూ.. ఫిన్ అలెన్ అద్భుతం చేశాడని ప్రశంసించాడు. ‘సెమీఫైనల్ మ్యాచ్లు ప్రేక్షకులను సీటు అంచున కూర్చునేలా చేస్తాయి.. అయితే ఫిన్ మనం సర్దుకుని కూర్చునేలోపే మ్యాచ్ పూర్తిచేశాడు’ అని పేర్కొన్నాడు.