T20 WCలో టీమిండియా ఫీల్డింగ్ ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 13 క్యాచులు చేజార్చింది. ఇంగ్లండ్తో సెమీస్ ముంగిట దీనిపై బౌలింగ్ కోచ్ మోర్కెల్ మాట్లాడుతూ.. ఎవరూ కావాలని క్యాచులు వదిలేయరని, టోర్నీ ముందు నుంచే ఫీల్డింగ్పై టీమ్ చాలా ఫోకస్ చేసిందని పేర్కొన్నాడు. అనుకోకుండా చేజార్చిన క్యాచులపై సమాధానం ఇవ్వడం కూడా కష్టమేనని చెప్పుకొచ్చాడు.