ATP: అనంతపురం మార్కెట్ యార్డ్లో రైతుల సమస్యల పరిష్కారంపై ఛైర్పర్సన్ బల్లా పల్లవి గురువారం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారికి గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని వ్యాపారులను కోరారు. మార్కెట్ ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు.