ప్రకాశం: రాష్ట్ర మారీటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య జన్మదిన శుభ సందర్భంగా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద స్థానికులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోకూరి రవి, కామేపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోటు మురళి ఆధ్వర్యంలో సింగరాయకొండ వెళ్తున్న సత్యను గజమాలతో సత్కరించారు.