IPL-2026 ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం 10 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయ్యర్ (PBKS), గిల్ (GT), పంత్ (LSG), రుతురాజ్ (CSK), అక్షర్ పటేల్ (DC), పటీదార్ (RCB), రహానే (KKR), పాండ్యా (MI), ఇషాన్ కిషన్ (SRH), పరాగ్ (RR) తమ తమ జట్లకు సారథ్యం వహిస్తున్నారు. IPL చరిత్రలో తొలిసారిగా అన్ని జట్లకూ భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తుండటం విశేషం.
పాక్ ప్లేయర్లు PSLను IPLతో పోలుస్తూ ఉంటారు. అయితే, RCB (రూ.16,700 కోట్లు), RR (రూ.15,290 కోట్లు) వంటి ఒక్కో IPL జట్టు విలువ వేల కోట్లలో ఉంది. PSL లీగ్ మొత్తం విలువ కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే. దీంతో భారత నెటిజన్లు, కేవలం ఒక్క IPL జట్టును అమ్మితే పాక్ క్రికెట్ బోర్డు(రూ.450-580 కోట్లు)తో పాటు వారి మొత్తం లీగ్ను కూడా కొనుగోలు చేయవచ్చని కామెంట్లు చేస్తున్నారు.
అశ్విన్పై యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఫైర్ అయ్యాడు. LSG జట్టులో ఉన్న సచిన్ తనయుడు అర్జున్కు తుది జట్టులో చోటు దక్కదని అశ్విన్ అన్నాడు. దీనిపై యోగ్రాజ్ స్పందిస్తూ.. ‘అర్జున్కు చోటు దక్కదనడానికి నువ్వు ఎవరు? నీకున్న అర్హత ఏంటి? సచిన్ కొడుకుగా అర్జున్పై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది. ఇలాంటి మాటలు అతడిపై మరింత ఒత్తిడిని పెంచుతాయి’ అని అన్నాడు.
IPL-2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 5న మ.3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో SRH, LSG జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు రేపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయని SRH యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ‘District by Zomato’ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక SRH జెర్సీని ఉచితంగా పొందవచ్చు.
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో ఇకపై ఎటువంటి ఫిజికల్ టిక్కెట్లను అనుమతించబోమని తెలిపారు. కేవలం డిజిటల్ QR కోడ్ టిక్కెట్లను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. టిక్కెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కమ్బ్యాక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జట్టుకు దూరమైన సమయంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని అన్నాడు. నిరంతరం శ్రమిస్తూ సరైన అవకాశం కోసం వేచి చూశానని ఇషాన్ వెల్లడించాడు. ఈ ప్రయాణం మొత్తం తనపై తనకు ఉన్న నమ్మకం వల్లే సాధ్యమైందని తెలిపాడు.
ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఊరట లభించింది. స్టార్ పేసర్ బుమ్రా ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని సమాచారం. తన ఫిట్నెస్, వర్క్లోడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించేందుకే బుమ్రా ఇటీవల BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా బుమ్రా గాయంపై వస్తున్న ఊహాగానాలకు పూర్తిగా తెరపడింది.
IPL-2026 నేపథ్యంలో ముంబైలో 10 జట్ల కెప్టెన్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అందరూ కలిసి సరదాగా గడుపుతూ ఫొటో షూట్లో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 10 జట్లకు భారత ప్లేయర్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సింగపూర్లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. IPLతో కాస్త విరామం దొరకడంతో భార్య, పిల్లలతో కలిసి ఆయన సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. IPL ముగిసిన వెంటనే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో స్వదేశంలో తలపడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మొదటిసారి సన్రైజర్స్ జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన నెల రోజుల్లోనే తన ఇన్స్టా ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్ల నుండి 3.5Mకు పెరిగిందని వెల్లడించాడు. ‘IPL అనేది చాలా పెద్ద వేదిక. తాము ఆడుతున్నప్పుడు హైదరాబాద్ నగరం మొత్తం మా వెంటే ఉంటుంది’ అని పేర్కొన్నాడు.
IPL చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2016లో కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆ సీజన్లో 16 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఏ ఇతర ఆటగాడు కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లోకి రాలేకపోయాడు. మరి ఈ సీజన్లోనైనా ఈ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.
RCB ఫ్రాంఛైజీ రూ.16,706 కోట్ల భారీ ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నెదర్లాండ్స్ క్రికెట్ను అభివృద్ధి చేయడానికి చేయడానికి.. RCB అమ్ముడైన మొత్తంలో 0.5 శాతాన్ని తమకు ఇచ్చినా చాలు అని తెలిపాడు. ఈ మొత్తంతో నెదర్లాండ్స్ క్రికెట్ గతి మారుతుందని వ్యాఖ్యానించాడు.
IPL 2026 నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందించింది. ‘ఈ సీజన్ ఆడబోనని డకెట్ ముందే చెప్పాడు. అతనికి రిప్లేస్మెంట్ కోసం మరో ఆటగాడిని వెతుకుతున్నాం. ఎవరిని తీసుకున్నామో త్వరలోనే చెప్తాం’ అని తెలిపింది. డకెట్ నిర్ణయంపై ఢిల్లీ సానుకూలంగా స్పందించినప్పటికీ.. IPL రూల్స్ ప్రకారం అతనిపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
IPL చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లుగా రోహిత్(302), కోహ్లీ(291) 2 & 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ 2026 సీజన్లో అగ్రస్థానం కోసం గేల్(357) రికార్డు బ్రేక్ చేయడం కొంచెం కష్టమే అయినా.. రోహిత్ను అధిగమించేందుకు మాత్రం కోహ్లీకి ఛాన్స్ ఉంది. ఇందుకోసం ఈ టోర్నీలో రోహిత్ బాదనున్న సిక్సర్ల కంటే కోహ్లీ 13 అధికంగా కొడితే చాలు.