• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

భారీ రికార్డుపై కన్నేసిన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టీ20ల్లో భారీ రికార్డుపై  కన్నేసింది. ఆమె మరో 34 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తుంది. ఇవాళ భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో మంధాన ఈ రికార్డను సాధించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం చమరి ఆటపట్టు (720) అగ్రస్థానంలో ఉంది.

December 19, 2024 / 12:31 PM IST

నేను అత్యుత్తమంగా ఆడలేదు: గుకేశ్‌

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌, లిరెన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ పోటాపోటీగా సాగలేదని మాజీ ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సెన్ విమర్శించాడు. దీనిపై తాజాగా గుకేశ్ స్పందించాడు. ఫైనల్స్‌లో తాను 100 శాతం అత్యుత్తమంగా ఆడలేదని అంగీకరించాడు. టోర్నీ తీవ్రతను, రెండు వారాల పాటు తాను ఎదుర్కోబోతున్న ఒత్తిడిని అంచనా వేయలేకపోయినట్లు పేర్కొన్నాడు. కానీ, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒక...

December 19, 2024 / 12:06 PM IST

22న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

కర్నూలు జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో ఈనెల 22వ తేదీన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్ గురువారం తెలిపారు. 2006-జనవరి-1తేదీ తరువాత జన్మించిన వారు అర్హులన్నారు. ఆధార్, టెన్త్ మార్కుల మెమో జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.

December 19, 2024 / 11:34 AM IST

అంతారం విద్యార్థికి ప్రథమ స్థానం

సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో బుధవారం నిర్వహించిన జీవశాస్త్రం ప్రతిభా పరీక్ష పోటీల్లో గుమ్మడిదల మండలం అంతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి జస్వంత్ ప్రథమ స్థానం సాధించాడు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతి, ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. జశ్వంత్ రాష్ట్రస్థాయిలో కూడా రాణించాలని డీఈఓ ఆకాంక్షించారు.

December 19, 2024 / 09:40 AM IST

సీఎం కప్ క్రీడల్లో వెలిమినేడు విద్యార్థులకు జిల్లా మొదటి బహుమతి

నల్గొండ జిల్లాలోని వెలిమినేడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు సీఎం కప్ క్రీడల్లో వాలీబాల్‌లో జిల్లా ఫస్ట్ బహుమతి సాధించారు. కెప్టెన్ కూరాకుల యశ్వంత్, నూతనకంటి లింగస్వామి, దండు వివేక్, దండు మహేష్, గుండ్లపల్లి మధు, మళ్లం రోహిత్, టీం సభ్యులను వెలిమినేడు మాజీ ఎంపీటీసీ దేశబోయిన స్వరూప నరసింహ అభినందించారు. రాష్ట్ర స్థాయి బహుమతి సాధించాలని ఆకాంక్షించారు.

December 19, 2024 / 07:30 AM IST

నేడు కామారెడ్డి బాలుర పాఠశాల మైదానంలో జిల్లా స్థాయిపోటీలు

కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరగనున్న సీఎం కప్పు జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి హీరా లాల్ తెలిపారు. పాల్గొన్న క్రీడాకారులు ఉదయం 9 గంటల వరకు మైదానంకు హాజరు కావాలని చెప్పారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ఖోఖో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని కోరారు.

December 19, 2024 / 07:12 AM IST

నేటి నుంచి గురుకుల విద్యార్థినులకు క్రీడా పోటీలు

HYD: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తమ విద్యాలయాల్లోని విద్యార్థినులకు 10వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గురువారం నుంచి మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ లత తెలిపారు. ఇందుకోసం షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని విద్యాలయంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల నుండి పాల్గొంటారన్నారు.

December 19, 2024 / 06:51 AM IST

రేపటి నుంచి క్రీడా పోటీలు

GNTR: స్థానిక హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో ఆదర్శ్- 2024 పేరుతో రాష్ట్రస్థాయి అంతర్ ఇంజినీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు కళాశాల కార్యదర్శి రామకృష్ణమూర్తి తెలిపారు. ఈ పోటీలను సృజనాత్మకత, సాంస్కృతిక విభాగం కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్విని ప్రారంభిస్తారన్నారు

December 19, 2024 / 06:39 AM IST

అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన కథలాపూర్ విద్యార్థులు

JGL: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని, కళాధార పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు, హెచ్ఎం కమలాకర్, పీఈటి అజయ్ తెలిపారు. పాఠశాలకు చెందిన హైందవి, రిశ్వంత్, చరణ్ అనే విద్యార్థులు, మండల స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటడంతో, జిల్లా స్థాయికి ఎంపికైనట్లు వారు పేర్కొన్నారు.

December 19, 2024 / 04:15 AM IST

నిజామాబాద్‌లో “తెలంగాణ గోల్డ్ కప్”

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ 2025 ట్రోఫీని నిర్వహించనున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. 2025 జనవరిలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నీ సందర్భంగా ఆయన నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ గ్రౌండ్ ను సందర్శించారు. సందర్భంగా టోర్నీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

December 19, 2024 / 04:15 AM IST

అండర్ 19 హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఎంపికైన వంతడుపుల వాసి

SRCL: ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట శ్రీవల్లి అండర్-19 క్రికెట్ మహిళా వన్డే హైదరాబాద్ జట్టుకు ఎంపికైంది. జనవరి 4 నుంచి 12 వరకు కేరళలోని త్రివేండ్రంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొంటుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. శ్రీవల్లి అండర్ -19 క్రికెట్ మహిళా వన్డే హైదరాబాద్ జట్టుకు ఎంపికైనందుకు తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

December 19, 2024 / 04:11 AM IST

క్రికెట్‌ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు

తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్‌ సోరెంగ్‌ విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని.. దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రాహుల్‌.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు. కాగా, కశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పిల్లలకు తన పాఠశాలలో సెహ్వాగ్ ఉచితంగా విద్యనందించాడు.

December 18, 2024 / 09:33 PM IST

ద్రవిడ్, సెహ్వాగ్, ధోనీ సరసన అశ్విన్ కూడా..!!

రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లోనే ఆటకు వీడ్కోలు పలికాడు. కాగా, గతంలోనూ ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడిన తర్వాతనే పలువురు క్రికెటర్లు.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అందులో అనిల్ కుంబ్లే, గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, ధోనీ ఉన్నారు.

December 18, 2024 / 05:23 PM IST

ఈ నెల 21 నుంచి బ్యాడ్మింటన్ పోటీలు

SDPT: హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్సై జాన్ విల్సన్ స్మారకార్థం ఈనెల 21, 22, 23 తేదీల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ వెనక ఉన్న ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9963202414, 9640510668, 8106906577, 9441925763 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

December 18, 2024 / 04:02 PM IST

PHOTO: ఇక మిగిలింది కోహ్లీ ఒక్కడే..!

అశ్విన్ రిటైర్మెంట్‌తో వన్డే ప్రపంచకప్ 2011 గెలిచిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే మిగిలాడు. ధోని సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లలో అందరూ ఇప్పటికే భారత జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం కోహ్లీ ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మేరకు అప్పటి జట్టులో కోహ్లీని మార్క్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది.

December 18, 2024 / 03:37 PM IST