భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సురక్షితంగా భారత్కు తిరిగి వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆమె దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టినట్లు సింధు తాజాగా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొంది.