TPT: తడ-వరదయ్యపాలెం రహదారి మరమ్మతులకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు మంజూరు చేసినట్టు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి అదిమూలం తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రోడ్డు గుంతలను పూడ్చి ఒక లేయర్ వేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.