NDL: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.