MNCL: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్ కోరారు. మంగళవారం సమితి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యుద్ధానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దని ఆయన కోరారు.