KDP: బద్వేల్ పరిధిలోని ఆంజనేయ నగర్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం రూ.7,50,000 నిధులతో డ్రైనేజ్ కాలువ పనులు ప్రారంభమైనట్లు మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి గారు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత మురుగు నీటితో పాటు వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా సాఫీగా వెళ్లే విధంగా సదుపాయం కలుగుతుందని తెలిపారు.