KKD: ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని కాకినాడ ట్రాఫిక్ వన్ టౌన్ సీఐ నూని రమేశ్ సూచించారు. శనివారం కాకినాడ మెయిన్ రోడ్డులో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. పోలీసులకు భయపడి హెల్మెట్ పెట్టుకోవడం కాదని ప్రాణాలు రక్షించుకోవడానికి హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాల విధిస్తామన్నారు