ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో రేపు పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ డా. జీ.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉండి వినతులు స్వీకరిస్తారు. రెవెన్యూ క్లినిక్లలో కూడా అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. అలాగే, Meekosam పోర్టల్, 1100 ద్వారా అర్జీల వివరాలు తెలుసుకోవచ్చు అని పేర్కొన్నారు.