సత్యసాయి: గ్రామాల్లో నీటి నిల్వలను పెంచడం అత్యంత అవసరమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం గోరంట్ల మండలం రెడ్డి చెరువు కట్ట వద్ద జలధార–జలహారతి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. జలాధారలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని, చెరువులు, కుంటలు, కాలువలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.