రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్తో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త పంపిణీ బాధ్యతలను హాలీవుడ్ దిగ్గజ సంస్థ ‘వార్నర్ బ్రదర్స్’ చేపట్టబోతున్నట్లు సమాచారం.