NDL: రుద్రవరం మండలం మందలూరు గ్రామానికి చెందిన రజకుల కోసం దోబీ ఘాట్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులు బుధవారం 2 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. మందలూరు గ్రామ నాయకులు, రజకులు ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రజకుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.