AKP: కొయ్యూరు మండలం గదబపాలెం పంచాయతీ మల్లవరం గ్రామానికి చెందిన తూబిరి మల్లేశ్, దేవిల కుమార్తె వర్షిణి నవోదయ, సైనిక్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబర్చింది. నవోదయలో 90/100, సైనిక్లో 178/300 మార్కులు సాధించింది. బుధవారం నర్సీపట్నంలో జరిగిన ఓ పాఠశాల ప్రారంభోత్సవంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్షిణిని ప్రత్యేకంగా అభినందించారు.