కృష్ణా: గుడ్లవల్లేరు(M) అంగలూరులో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవ పెద్దల వరకు చేరి కిరాతక దాడికి దారి తీసింది. ఈ ఘటనలో కొందరు కత్తులతో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.