ప్రకాశం: ఆపరేషన్ వజ్రాహర్ కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి మండలంలో శనివారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదార్థాలు గంజాయి వంటి అంశాలపై అవగాహన కల్పించి ప్రజలను హెచ్చరించారు.