AP: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన ప.గో.జిల్లా చిట్టవరానికి చెందిన వర్ధనపు కవిత(23) ఈ నెల 23న ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితమే వెళ్లిన ఆమె, పని చేసే ఇంట్లోనే ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కవిత మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతూ కేంద్రమంత్రి శ్రీనివాసవర్మకు వినతిపత్రం అందజేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.