KKD: ఏలేశ్వరం గ్రామంలోని కప్పలచెరువు వద్ద పార్కు నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యప్రభ శనివారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పార్కు నిర్మాణంతో స్థానిక ప్రజలకు విశ్రాంతి కల్పించడంతో పాటు గ్రామ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.