W.G: ఏపీఐఐసీ ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఇదే తొలిసారి, తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రామరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.