TG: రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని చూస్తే ఆయా పాఠశాలల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా పిల్లలు మధ్యాహ్నం బయటికి వెళ్లకుండా, అలాగే ఈత కోసం బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.