KRNL: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్ష సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు.