W.G: ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. నరసాపురం నియోజకవర్గంలో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.6,66,687 విలువైన CMRF చెక్కులను ఆయన శనివారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.