ATP: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అనంతపురం టవర్ క్లాక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య దగ్గుపాటి మాట్లాడుతూ.. మహిళా బిల్లు విషయంలో కూటమి కుటిల రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు.