ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే నినాదంతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉపాధ్యాయులతో కలిసి రాచర్లలో వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.