KRNL: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దిగువ కాలువలో నీటి ప్రవాహం తగ్గింది. ఈనెల 3న టీబీ డ్యాం నుంచి 3 వేలకుపైగా క్యూసెక్కుల నీరు విడుదల చేసినా, ప్రస్తుతం కర్ణాటక వాటా నిలిపివేయడంతో కేవలం 1100 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. హానవాళుకు చేరేసరికి ఇది 400 క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. దీంతో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది.