CTR: పుంగనూరు సుబేదారి వీధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఆరాధన మహోత్సవాలను ఆదివారం స్వర్ణకార సంఘం వారు నిర్వహించారు. మొదట స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. మహోత్సవాలలో భాగంగా రాత్రికి స్వామి వారి ఊరేగింపు ఉంటుందని అర్చకులు చెప్పారు.